మరోసారి భారత్ కు పతకాల వర్షం... ఆసియ క్రీడల్లో పాల్గొననున్న మనూ భాకర్, తజీందర్పాల్
Asian Games 2026: జపాన్లోని ఐచీ-నగోయాలో జరగనున్న 2026 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకాన్ని మనూ భాకర్, తజీందర్పాల్ సింగ్ తూర్ మోయనున్నారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన షూటర్ మనూ భాకర్తో పాటు.. ఆసియా క్రీడల్లో వరుసగా రెండు షాట్పుట్ స్వర్ణాలు సాధించిన తజీందర్పాల్ తూర్కు ఈ ప్రతిష్ఠాత్మక అవకాశం దక్కింది.
- 2026 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారులుగా మనూ భాకర్, తజీందర్పాల్ సింగ్ తూర్ ఎంపికయ్యారు.
- ఈసారి ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 492 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
Asian Games 2026: జపాన్లోని ఐచీ-నగోయాలో జరగనున్న 2026 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకాన్ని మనూ భాకర్, తజీందర్పాల్ సింగ్ తూర్ మోయనున్నారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన షూటర్ మనూ భాకర్తో పాటు.. ఆసియా క్రీడల్లో వరుసగా రెండు షాట్పుట్ స్వర్ణాలు సాధించిన తజీందర్పాల్ తూర్కు ఈ ప్రతిష్ఠాత్మక అవకాశం దక్కింది.
వీరిద్దరినీ భారత పతాకధారులుగా ఎంపిక చేసిన విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. భారత బృందం చీఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ మనూ భాకర్ పేరును ప్రకటించగా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తజీందర్పాల్ సింగ్ తూర్ను రెండో పతాకధారిగా ఖరారు చేసింది.
ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు
2024 పారిస్ ఒలింపిక్స్ మనూ భాకర్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పతకం సాధించిన ఆమె.. సరబ్జోత్ సింగ్తో కలిసి మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మరో కాంస్యాన్ని గెలుచుకుంది.
దీంతో ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా మనూ భాకర్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకాన్ని మోయడం ఆమెకు మరో అరుదైన గౌరవంగా నిలిచింది.
తూర్ లక్ష్యం.. హ్యాట్రిక్ స్వర్ణాలు
షాట్పుట్ స్టార్ తజీందర్పాల్ సింగ్ తూర్కు ఆసియా క్రీడల్లో ఘనమైన రికార్డు ఉంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తూర్.. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ తన టైటిల్ను నిలబెట్టుకున్నాడు.
హాంగ్జౌలో 20.36 మీటర్ల అత్యుత్తమ త్రోతో స్వర్ణ పతకం సాధించాడు. ఇప్పుడు ఐచీ-నగోయా ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించి వరుసగా మూడోసారి ఆసియా క్రీడల చాంపియన్గా నిలవాలని తూర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
భారత్పై భారీ అంచనాలు
ఈ ఆసియా క్రీడల్లో మనూ భాకర్, తజీందర్పాల్ తూర్ ప్రదర్శనపై భారీ అంచనాలు ఉన్నాయి. భారత్ నుంచి మొత్తం 492 మంది క్రీడాకారులతో కూడిన బృందం పోటీల్లో పాల్గొంటోంది.
2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించింది. ఈసారి కూడా ఆ విజయ పరంపరను కొనసాగించాలని భారత బృందం లక్ష్యంగా పెట్టుకుంది.
నీరజ్ చోప్రా దూరం.. భారత్కు ఎదురుదెబ్బ
ఆసియా క్రీడలకు ముందు భారత బృందానికి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శిక్షణ సమయంలో చీలమండ లిగమెంట్కు గాయపడటంతో ఆసియా క్రీడల నుంచి వైదొలిగాడు.
ఈ గాయం కారణంగా అతడి 2026 సీజన్ ముందుగానే ముగిసింది. నీరజ్ గైర్హాజరీ భారత అథ్లెటిక్స్ బృందానికి లోటుగా మారనుంది. అయినప్పటికీ మనూ భాకర్, తజీందర్పాల్ తూర్ సహా భారత అథ్లెట్లపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
Tags
Be the first to react