విజయవాడ: తమ సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించడానికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈరోజు మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ను ముట్టడించనున్నారు.
మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే అంత వరకు సమ్మె వదలబోమని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఎనలేని సేవలు అందించిన మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం గుర్తించడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మరోవైపు కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసేందుకు భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేరకు బస్సులను ఏర్పాటు చేసి పోలీస్ స్టేషనులకు, కళ్యాణ మండపాలకు మున్సిపల్ కార్మికులను తరలించేందుకు పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి