మధ్యప్రదేశ్లోని ఇందోర్ బైక్ విషయంలో 'నో హెల్మెట్.. నో పెట్రోల్' నిబంధన ఇటీవల అమల్లోకి వచ్చింది. దీన్ని ఉల్లంఘిస్తూ ఓ ద్విచక్ర వాహనదారుడు చేసిన పని.. పెట్రోల్ బంక్ సీజ్కు దారితీసింది. స్థానికంగా ఓ పాల విక్రేత ఇటీవల తన బైక్లో ఇంధనం కోసం బంక్కు వచ్చారు. అయితే, హెల్మెట్ లేకపోవడంతో.. పాల క్యాన్ మూతను తీసి తలపై పెట్టుకోవడం గమనార్హం.
బంక్ నిర్వాహకులు సైతం ఇదేమీ పట్టించుకోకుండా పెట్రోల్ పోశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది కాస్త అధికారుల కంటపడటంతో వారు కన్నెర్ర చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్లు గుర్తించి.. ఆ పెట్రోల్ బంక్ను సీజ్ చేశారు. మరోవైపు.. ఆన్లైన్ వేదికగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఆగస్టు 1 నుంచి 'నో హెల్మెట్.. నో పెట్రోల్ అమలవుతోంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ వద్దకు వస్తే.. వారికి ఇంధనం నిరాకరిస్తున్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. సంబంధిత బంక్లపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఏడాది జైలు శిక్ష లేదా రూ.5వేల జరిమానా లేదా రెండూ ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు.