దేశవ్యాప్తంగా బైక్ ట్యాక్సీ, రైడ్షేరింగ్ సేవలతో రెండో స్థానంలో ఉన్న ర్యాపిడో, ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘ఓన్లీ’ (Only) పేరుతో కొత్త యాప్ను లాంచ్ చేసిన ర్యాపిడో, ప్రస్తుతం బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేవలు ప్రారంభించింది.
వావ్, ఈట్ ఫిట్, క్రిస్పీ, క్రీమ్ వంటి బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ర్యాపిడో, ప్లాట్ఫామ్లో ఎక్కువగా రూ.150 లోపే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని చెబుతోంది. ముఖ్యంగా రెస్టారెంట్ల నుంచి కేవలం 8–15% కమీషన్ మాత్రమే వసూలు చేస్తూ, జొమాటో–స్విగ్గీ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2015లో బైక్ ట్యాక్సీ ప్లాట్ఫామ్గా ప్రారంభమైన ర్యాపిడో, ప్రస్తుతం 500 పైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే తన బైక్ నెట్వర్క్ను ఉపయోగించి వ్యక్తిగత రెస్టారెంట్ల డెలివరీ సేవలను అందిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు ఆ విస్తృత అనుభవాన్ని ఫుడ్ డెలివరీ మార్కెట్లో వినియోగించుకోవాలని భావిస్తోంది.