తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరిగింది. దీని కారణంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు భారీగా వద నీరు చేరుతోంది. నాగార్జునసాగర్ నిండుకుండలా మారడంతో, ప్రాజెక్టులోని 26 గేట్లలో 24 గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్ఫ్లో 1,74,533 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది. భారీ వరద ప్రవాహంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేయబడింది.
సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 309.95 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. వరద నీటి ఉద్ధృతి కారణంగా గేట్లను మరింత సేపు తెరిచి ఉంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.