Header Banner

విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్..! కేవలం 9 గంటల్లో..!

  Tue May 20, 2025 07:25        Politics

విజయవాడ-బెంగళూరు నగరాల మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త అందించనుంది. ఈ రెండు కీలక నగరాల మధ్య అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కేవలం తొమ్మిది గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోలిస్తే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు సర్వీసు కార్యరూపం దాల్చితే, బెంగళూరుకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులతో పాటు, తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 8 బోగీలు ఉంటాయి. వీటిలో ఏడు ఏసీ చైర్ కార్ కోచ్‌లు కాగా, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌గా ఉంటుంది. మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

విజయవాడ నుంచి బెంగళూరు (రైలు నెం. 20711)
ప్రతిపాదిత రైలు సమయాలు  
విజయవాడలో ఉదయం 5:15 గంటలకు బయలుదేరుతుంది. తెనాలికి 5:39, ఒంగోలుకు 6:28, నెల్లూరుకు 7:43, తిరుపతికి 9:45, చిత్తూరుకు 10:27, కాట్పాడికి 11:13, కృష్ణరాజపురానికి మధ్యాహ్నం 1:38 గంటలకు చేరుకుంటుంది. చివరగా మధ్యాహ్నం 2:15 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు స్టేషన్‌కు చేరుకుంటుంది.

 బెంగళూరు నుంచి విజయవాడ (రైలు నెం. 20712) 
 అదే రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు నుంచి రైలు తిరుగు ప్రయాణమవుతుంది.
 కృష్ణరాజపురానికి 2:58, కాట్పాడికి సాయంత్రం 5:23, చిత్తూరుకు 5:49, తిరుపతికి రాత్రి 6:55, నెల్లూరుకు 8:18, ఒంగోలుకు 9:29, తెనాలికి 10:42 గంటలకు చేరుకుంటుంది. చివరగా రాత్రి 11:45 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికుల కోసం వారానికి మూడు రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం - యశ్వంత్‌పూర్ కొండవీడు ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త వందేభారత్ రైలు ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కలుగుతుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ! ఆ మూడు డిమాండ్లపై..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #metro #travel #time #vijayawada #banglore #time