క్రికెటర్ల అభిమానులపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఎంఎస్ ధోనీ ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుతూ.. ధోనీకి మాత్రమే అసలైన అభిమానులు ఉన్నారని, మిగతా క్రికెటర్ల అభిమానుల్లో చాలామంది సోషల్ మీడియా ఫ్యాన్స్ లేదా డబ్బులిచ్చి నడిపించేవారని హర్భజన్ వ్యాఖ్యానించారు. ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ధోనీ ఎంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడొచ్చు. అభిమానులు కూడా అతను ఆడాలనే కోరుకుంటారు. నా అభిప్రాయం ప్రకారం, అతనికి మాత్రమే నిజమైన ఫ్యాన్ బేస్ ఉంది. మిగతా వాళ్లందరూ సోషల్ మీడియాలో కనిపించేవాళ్లే, అందులోనూ కొందరు పెయిడ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారి గురించి చర్చించడం అనవసరం" అని హర్భజన్ పేర్కొన్నారు. హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు, అదే ప్యానెల్లో ఉన్న మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా నవ్వుతూ "ఇంత నిజం చెప్పకూడదు భజ్జీ" అని అన్నారు. దానికి హర్భజన్ "ఎవరో ఒకరు చెప్పాలి కదా" అని బదులిచ్చారు. అయితే, హర్భజన్ వ్యాఖ్యలు విరాట్ కోహ్లీ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. తమ అభిమాన ఆటగాడిని కించపరిచేలా భజ్జీ మాట్లాడారని వారు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!
జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!
ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్ లేకపోతే!
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: