ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ ప్రక్రియ కొనసాగుతోంది.. ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్‌ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది.. ఈ ప్రక్రియతో పాటుగా ఆ దశల పూర్తికి 21 రోజుల సమయం పడుతోంది. ఈ క్రమంలో రేషన్ కార్డుల దరఖాస్తుల పురోగతిని ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

'https///vswsonline.ap.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే.. ఏపీ సేవా అధికారిక పోర్టల్‌ వస్తుంది. అందులో కుడి వైపున పైన సర్వీస్‌ రిక్వెస్ట్‌ స్టేటస్‌ చెక్‌ అనే సెర్చ్‌ గడియ ఉంటుంది. అక్కడ అందులో రేషన్‌ కార్డు దరఖాస్తు సమయంలో వచ్చిన సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది.. తర్వాత ఓ కోడ్‌ వస్తుంది. ఆ వివరాలు అందులో పొందుపరిస్తే.. రేషన్‌ కార్డు దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉందో తెలిసిపోతుంది. ప్రక్రియ ఎన్ని రోజుల్లోపు పూర్తవుతుంది వంటి వివరాలు కనిపిస్తాయి' అని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా స్మార్ట్ కార్డులు అందజేస్తామని..రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌరసరఫరాల శాఖ సేవలు అందుబాటులో వచ్చిందన్నారు.

ఒక సంవత్సరం లోపు పిల్లలకు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన అన్నారు.. అంటే వారికి ఈకేవైసీ అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 95 శాతం కేవైసీ పూర్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తే పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త కార్డు ఇస్తారని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారని తెలిపారు.పెళ్లి కాకుండా 50 ఏళ్లు దాటి ఒంటరిగా ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని ఆయన అన్నారు. లింగమార్పిడి చేయించుకున్న వారికి కూడా మొదటిసారిగా రేషన్ కార్డులు అందజేస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగానే ఇస్తామన్నారు మంత్రి. మరోవైపు రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర(95523 00009)లో రేషన్ కార్డుల సేవలు ప్రారంభమయ్యాయి. అయితే, పెళ్లైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్తదానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. వాట్సాప్‌లో రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, అడ్రస్ మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డుల సరెండర్ వంటి సేవలు అందుతాయన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group