సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాతా సుఖీభవ (Annadata Sukhibhava) పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి పార్థసారథి (Pardha saradhi) తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ. 20వేలు అందిస్తామన్నారు.
బాపట్ల జిల్లా రేపల్లె మార్కెట్ యార్డులో మరో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ కృష్ణ ప్రసాద్ కలిసి ఆయన 'అన్నదాతా సుఖీభవ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేపల్లె నియోజకవర్గంలో 28 వేల మంది రైతులకు రూ.15 కోట్లు అందిస్తున్నామన్నారు.
"గత ప్రభుత్వ హయాంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వం 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తోంది. గత వైకాపా ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1,674 కోట్లు కూడా చెల్లించాం. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం” అని పార్థసారథి వివరించారు.