విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పరేడ్లో పాల్గొన్న వివిధ బెటాలియన్లను పర్యవేక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిలకించేందుకు విద్యార్థులు, నగర ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎం చంద్రబాబు తన వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన, పరేడ్ అందరినీ ఆకట్టుకున్నాయి.