హైదరాబాద్ నగరంలో ఆతిథ్య రంగం ఊపందుకుంటోంది. రానున్న ఆరేడేళ్లలో 25 వరకు స్టార్ హోటళ్లు, రిసార్టులు రాబోతున్నాయి. అంతర్జాతీయంగా పేరున్న పలు హోటళ్లు, దేశీయంగా ఆతిథ్య రంగంలో ఉన్న సంస్థలు కొత్త ప్రాంతాల్లో విస్తరించేందుకు డెవలపర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వీటిలో అత్యధికం ఐటీ కారిడార్లో, శంషాబాద్ విమానాశ్రయ మార్గం, జీనోమ్ వ్యాలీ ఉన్న శామీర్పేట, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుకాబోతున్నాయి. 2032 నాటికి వీటిలో ఐదు వేలకు పైగా గదులు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్.. మైస్ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్)కు రాజధానిగా ఎదుగుతోంది. ఇటీవల మిస్ వరల్డ్ పోటీలు మూడు వారాలపాటు జరిగాయి. వివిధ దేశాలకు చెందిన అందాలభామలు, స్పాన్సర్లు, ఇతర ప్రముఖులు వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. అంతకుముందు జీ-20 సదస్సు, రెండేళ్లకోసారి నిర్వహించే వింగ్స్ ఇండియా ఎగ్జిబిషన్, ఏటా జరిగే బయో ఏషియా సదస్సులతోపాటు మరెన్నో కీలక సమావేశాలకు భాగ్యనగరం ఆతిథ్యం ఇస్తోంది. వైద్య పర్యాటకంలో భాగంగా ఇతర దేశాల నుంచి చికిత్స కోసం రాష్ట్ర రాజధానికి వస్తున్నారు. వీటికితోడు డెస్టినేషన్ వెడ్డింగ్లకు నగరం కేంద్రంగా మారింది. ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఇక్కడి హోటళ్లు, రిసార్టులలో వేడుకలు జరుపుకొనేందుకు ఆసక్తిచూపుతున్నారు.
ఇది కూడా చదవండి: Real estate: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వరులు కావడం ఖాయం.. కీలక ప్రణాళికలు సిద్ధం, కొన్ని మండలాల్లో!
వీటన్నింటికి తోడు విదేశాల నుంచి ఐటీ కంపెనీల సీఈవోలు, క్లయింట్లు తరచుగా ఇక్కడి శాఖలను సందర్శించేందుకు వస్తుండటంతో కొన్నిసార్లు స్టార్ హోటళ్లలో గదులు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు హోటల్ గ్రూపులు విస్తరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొవిడ్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆతిథ్య రంగం.. ఆ తర్వాత వేగంగా కోలుకుంది. ప్రస్తుతం కొవిడ్కు ముందున్న స్థాయికి చేరుకుందని, 2023-24లో హైదరాబాద్లో హోటళ్ల ఆక్యుపెన్సీ 75.1 శాతం నమోదైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో మరింత పుంజుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్టు చెబుతున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 330 గదులతో హిల్టన్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ను 2030కి సిద్ధం చేయాలని ఆ సంస్థ కార్యాచరణ సిద్ధంచేసింది. 2029 నాటికి రాడిసన్ కలెక్షన్ పేరుతో 300 గదులు, కోకాపేట నియోపొలిస్లో ఇంటర్ కాంటినెంటల్ 250 గదులను, శంకర్పల్లిలో వెల్కం హోటల్-ఐటీసీ నుంచి 150 గదులు, 2040 నాటికి విమానాశ్రయంలో తాజ్ వివాంటా 225 గదులు, బుద్వేల్లో జేడబ్ల్యూ మారియట్ 330 గదులు, శంషాబాద్లో 220 గదులు నిర్మించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే తుక్కుగూడ, మొయినాబాద్, శామీర్పేట, మోమిన్ పేట, తుర్కపల్లి, తూప్రాన్ ప్రాంతాల్లో వివిధ సంస్థలు స్టార్ హోటళ్ల నిర్మాణానికి డెవలపర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయని క్రెడాయ్ వర్గాలు తెలిపాయి. మరికొన్ని ఒప్పందాల దశలో ఉన్నాయని పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?
kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!
AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!
YSRCP: జగన్ పర్యటనలో అరాచకం.. మాజీ మంత్రిపై కేసు.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా.!
Election Commission of India: ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!
YS Jagan: పల్నాడు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు వ్యవహారం..! వైసీపీ కార్యకర్త అరెస్టు!
Zero Commission: వారికి అదిరిపోయే న్యూస్! ఇక నుండి జీరో కమిషన్ .. మొత్తం డబ్బు మీకే!
Greenfield Highway: విజయవాడ నుండి నాగపూర్ వరకు కొత్త 4-లేన్ హైవే..! అక్కడ భూముల ధరలకు రెక్కలు!
Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!
ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్లోనే..
Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: