తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రి సర్కిల్ వద్ద గురువారం ఆయన జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. తిరుమలలో భక్తుల నుంచి ప్రైవేటు వాహనాల వారు అధికంగా డబ్బులు వసూలు చేయడాన్ని అరికట్టేందుకు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం.. తిరుమలలో బస్సులను ఉచితంగా నడిపేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషమయన్నారు. ఇందుకు ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సులు) తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను ఉచితంగా చేరవేస్తాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
YSRCP: జగన్ పర్యటనలో అరాచకం.. మాజీ మంత్రిపై కేసు.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా.!
Election Commission of India: ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!
YS Jagan: పల్నాడు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు వ్యవహారం..! వైసీపీ కార్యకర్త అరెస్టు!
Zero Commission: వారికి అదిరిపోయే న్యూస్! ఇక నుండి జీరో కమిషన్ .. మొత్తం డబ్బు మీకే!
Greenfield Highway: విజయవాడ నుండి నాగపూర్ వరకు కొత్త 4-లేన్ హైవే..! అక్కడ భూముల ధరలకు రెక్కలు!
Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!
ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్లోనే..
Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: