AndhraPradesh: ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాల(Airports) గురించి చర్చించడానికి జులై 4న ఒక సమావేశం జరగనుందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను 20 వరకు అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అలాగే, 14 విమానాశ్రయాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. కర్నూలు ఎయిర్పోర్టు అభివృద్ధికి రూ.8.033 కోట్లు మంజూరయ్యాయి అని తెలిపారు. నాగార్జునసాగర్, ఒంగోలులో విమానాశ్రయాల అభివృద్ధికి ఒక నివేదిక తయారుచేస్తారన్నారు, దీని కోసం కన్సల్టెంట్ సంస్థను ఎంపిక చేస్తారని, దీనికి ఏపీ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు అనుమతి ఇచ్చిందన్నారు.
ఇది కూడా చదవండి: Devineni: విద్వేషాలు రెచ్చగొట్టాలనే జగన్ కుట్రలు చెల్లవు! వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు!
ఆయా జిల్లాల కలెక్టర్లు విమానాశ్రయాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తిస్తారని, ముందస్తు అధ్యయనాన్ని ఏఏఐ పూర్తి చేసింది అన్నారు. అమరావతి, కుప్పం విమానాశ్రయాల నిర్మాణానికి కూడా నివేదికలు తయారు చేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. కర్నూలు ఎయిర్పోర్టు అభివృద్ధి కోసం రూ. 8.033 కోట్లకు అనుమతి లభించిందన్నారు. కర్నూలు విమానాశ్రయంలో రన్వే ఎండ్ సేఫ్టీ, టాక్సీవేలు, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కోసం అనుమతులు వచ్చాయన్నారు. కర్నూలు ఎయిర్పోర్టులో 2 అభివృద్ధి పనులకు 2025-26 సంవత్సరానికి విమానాశ్రయం కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అన్నారు.
ఇది కూడా చదవండి: YSRCP: జగన్ పర్యటనలో అరాచకం.. మాజీ మంత్రిపై కేసు.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా.!
రన్వేస్ ఆండ్ సేఫ్టీని సరిదిద్దడానికి ఇతర నిర్వహణ పనులకు రూ.3.6 కోట్లు, కర్నూలు ఎయిర్పోర్టులో టాక్సీవేటు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అందించడానికి రూ.4.433 కోట్లకు అనుమతి లభించాయన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఏపీ ఫైబర్నెట్లో 29 సంస్థలకు రూ.70.82 కోట్లు చెల్లించడానికి అనుమతులు ఇచ్చామన్నారు. సాగరమాల ప్రాజెక్టు కింద చేపట్టే పనులను పర్యవేక్షిస్తారని.. కొత్త ప్రతిపాదనలపై చర్చిస్తారని.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను కలిపి 20కి తగ్గకుండా అభివృద్ధి చేస్తారన్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎయిర్పోర్టుల్ని ప్లాన్ చేస్తోంది. కేంద్రం సహకారంతో వీటి నిర్మాణం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అధికారులు స్థలాలను కూడా పరిశీలించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్డేట్! ఈ పథకం త్వరలోనే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
YSRCP: జగన్ పర్యటనలో అరాచకం.. మాజీ మంత్రిపై కేసు.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా.!
Election Commission of India: ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!
YS Jagan: పల్నాడు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు వ్యవహారం..! వైసీపీ కార్యకర్త అరెస్టు!
Zero Commission: వారికి అదిరిపోయే న్యూస్! ఇక నుండి జీరో కమిషన్ .. మొత్తం డబ్బు మీకే!
Greenfield Highway: విజయవాడ నుండి నాగపూర్ వరకు కొత్త 4-లేన్ హైవే..! అక్కడ భూముల ధరలకు రెక్కలు!
Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!
ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్లోనే..
Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: