IPS Transfers: ఏపీలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు బదిలీలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

IPS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అవసరాల దృష్ట్యా ఆరుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన (ఎస్సీ.సీ) శాఖ జారీ చేసిన జీఓ ఆర్టీఈ నంబర్ 1330 ప్రకారం ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి రానున్నాయి

AP IPS Transfers
AP IPS Transfers

పరిపాలనా మార్పులు.. ఐపీఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు..

చింతపల్లి నుంచి అమరావతి వరకు.. ఆరుగురు ఐపీఎస్ అధికారుల బదిలీలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అవసరాల దృష్ట్యా ఆరుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన (ఎస్సీ.సీ) శాఖ జారీ చేసిన జీఓ ఆర్టీఈ నంబర్ 1330 ప్రకారం ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.

ఉత్తర్వుల ప్రకారం చింతపల్లి ఏఎస్పీగా పనిచేస్తున్న నవజ్యోతి మిశ్రా (2021 బ్యాచ్)ను మార్కాపురం జిల్లాలో ఓఎస్డీ (అడ్మిన్)గా నియమించారు.

కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవ్రాజ్ మనీష్ (2022 బ్యాచ్)ను తూర్పుగోదావరి (రాజమహేంద్రవరం) జిల్లాకు అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు.

నంద్యాల ఏఎస్పీ మండ జవళి అల్ఫోన్స్ (2022 బ్యాచ్)ను పోలవరం జిల్లాలో ఓఎస్డీ (అడ్మిన్)గా నియమించారు.

రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే (2022 బ్యాచ్)ను అమరావతిలో ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్)గా పోస్టింగ్ ఇచ్చారు.

తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి (2022 బ్యాచ్)ను పల్నాడు జిల్లాకు అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు.

జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత (2023 బ్యాచ్)ను నంద్యాల ఏఎస్పీగా నియమించారు. పోలవరం జిల్లాకు బదిలీ అయిన మండ జవళి అల్ఫోన్స్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్)కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags

Be the first to react

Latest