LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: రైతులకు లాభదాయక ధరలు లక్ష్యం.. పంటల కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష!

Chandrababu: రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంటలకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ వంటి ముఖ్య పంటల కొనుగోళ్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

AndhraPravasi News Desk 1 min read
Chandrababu: రైతులకు లాభదాయక ధరలు లక్ష్యం.. పంటల కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష!

రాష్ట్రంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్ల పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..

మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు దక్కేలా చూడాలని సీఎం దిశానిర్దేశం..

అమరావతి: రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంటలకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ వంటి ముఖ్య పంటల కొనుగోళ్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తో పాటు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందాలంటే మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.

పంటలకు మంచి ధరలు రావాలంటే ట్రేసబిలిటీ (పంట మూలాన్ని గుర్తించే విధానం), సర్టిఫికేషన్ వంటి వ్యవస్థలను అమలు చేయాలని సూచించారు. ఇవి రైతులకు అదనపు లాభం అందించే అవకాశముందని తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి వచ్చే అవకాశముందని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, నాణ్యమైన దిగుబడులు సాధించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

అలాగే, ప్రకృతి సేద్యం విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తే రైతులకు ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని చంద్రబాబు అన్నారు. విభిన్న పంటలను సాగు చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని ఆయన వివరించారు. రైతు ఆదాయం పెరగడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…