LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Jobs: రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం.. మంత్రుల సమీక్ష!

Jobs: రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రుల బృందం స్పష్టం చేసింది.

AndhraPravasi News Desk 1 min read
Jobs: రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం.. మంత్రుల సమీక్ష!

ఉద్యోగ కల్పనపై వేగం పెంచిన ప్రభుత్వం..

రాష్ట్రంలో ఉద్యోగ సృష్టికి బలమైన చర్యలు..

అమరావతి: రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రుల బృందం స్పష్టం చేసింది. ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.

గురువారం ఏపీ సచివాలయం 5వ బ్లాక్‌లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయిమెంట్ జనరేషన్‌పై మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు కందుల దుర్గేష్, టి.జి. భరత్, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలను కూడా సమగ్రంగా నమోదు చేయాలని నిర్ణయించారు. నూతనంగా ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరి వివరాలను ఒక ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ వివరాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

అదేవిధంగా, ఆయా శాఖల అధికారులు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ, మధ్యస్థ, చిన్న పరిశ్రమలు (MSMEs) స్థాపన ద్వారా ఉద్యోగాల సృష్టి ఎలా జరుగుతోందో స్పష్టమైన డేటా ఉండాలని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలపై పూర్తి వివరాలు నమోదు చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమీక్షలో పలు కీలక అంశాలపై మంత్రులు ఉన్నతాధికారులతో చర్చించి, ఉద్యోగ కల్పన వేగవంతం చేసే దిశగా మార్గదర్శకాలు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగాల సృష్టి ప్రధాన పాత్ర పోషిస్తుందని, అందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రులు పేర్కొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…