LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

AP Kapu Welfare: కాపుల సంక్షేమానికి కూటమి సర్కార్ పెద్దపీట... బడ్జెట్‌లో భారీ కేటాయింపులు: మంత్రి సవిత!

AP Budget 2025-26: ఏపీలో కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపుల గురించి మంత్రి సవిత అసెంబ్లీలో వివరించారు. విదేశీ విద్య, కాపు భవనాల నిర్మాణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాల గురించి వివరాలు..

AndhraPravasi News Desk 2 min read
AP Kapu Welfare: కాపుల సంక్షేమానికి కూటమి సర్కార్ పెద్దపీట... బడ్జెట్‌లో భారీ కేటాయింపులు: మంత్రి సవిత!

AP Kapu Welfare: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన పథకాలను తిరిగి పునరుద్ధరించి, కాపు యువతకు అండగా నిలుస్తున్నామని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్‌లో సైతం కాపుల సంక్షేమానికి గతంలో కంటే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా సభకు వివరించారు.

విదేశీ విద్య విషయంలో గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014-19 మధ్యకాలంలో దాదాపు 1585 మంది కాపు విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.153 కోట్లకు పైగా ఖర్చు చేసిందని గుర్తు చేశారు. అయితే, గత ఐదేళ్లలో వైసీపీ కేవలం 81 మందికి మాత్రమే ఈ అవకాశం కల్పించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న 331 మంది విద్యార్థుల బకాయిలను విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) గాను కాపు సంక్షేమం కోసం రూ.5,571.48 కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు.

కాపు భవనాల నిర్మాణంపై స్పందిస్తూ.. గత ప్రభుత్వం వీటిని గాలికొదిలేసిందని మంత్రి సవిత ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ఈ భవనాల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం మళ్లీ వేగవంతం చేసిందని చెప్పారు. కేవలం నిధులు కేటాయించడమే కాకుండా, అవి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూస్తున్నామన్నారు. గతేడాది రూ.4,440 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది ఆ మొత్తాన్ని మరింత పెంచి కాపుల ఆర్థిక ఎదుగుదలకు బాటలు వేస్తున్నామని ఆమె వివరించారు.

యువతకు ఉపాధి కల్పనలో భాగంగా చేపట్టిన పథకాలను మంత్రి వివరించారు. ఆటో డ్రైవర్ల సేవా పథకం ద్వారా 25 వేల మందికి పైగా కాపు లబ్ధిదారులకు మేలు జరిగిందని, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కాపు కుటుంబాలకు భృతి అందించామని చెప్పారు. ముఖ్యంగా మెగా డీఎస్సీ కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం వల్ల 54 మంది కాపు అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందించేందుకు ఈ బడ్జెట్‌లో రూ.217 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.

మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత అన్నారు. చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద 10,300 మందిని, ఎంఎస్ఎంఈ గ్రూపుల ద్వారా మరికొంతమందిని గుర్తించి వారికి ఆర్థిక చేయూతనిస్తున్నామని చెప్పారు. అలాగే 11 వేల మందికి పైగా కాపు మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి, వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. కాపుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ఆమె పునరుద్ఘాటించారు

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…