Sports: క్రీడా ప్రతిభను కుల వివాదాల్లోకి లాగొద్దు.. సామాజిక ఐక్యతకు భంగం కలిగించొద్దు
Sports: క్రీడాకారులు తమ ప్రతిభ ఆధారంగానే డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించారని కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మంచౌదరి స్పష్టం చేశారు. ప్రతిభతో వచ్చిన విజయాలకు కులం రంగు పులమడం సరికాదని ఆయన అన్నారు.
క్రీడాకారుల ప్రతిభను కులంతో ముడిపెట్టడం సరికాదు – నాదెండ్ల బ్రహ్మంచౌదరి..
కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటాం: నాదెండ్ల బ్రహ్మంచౌదరి..
అమరావతి: క్రీడాకారులు తమ ప్రతిభ ఆధారంగానే డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించారని కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మంచౌదరి స్పష్టం చేశారు. ప్రతిభతో వచ్చిన విజయాలకు కులం రంగు పులమడం సరికాదని ఆయన అన్నారు.
కొంతమంది ఉద్దేశపూర్వకంగా సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో సమాజంలో అశాంతి కలిగించే ప్రయత్నాలను ప్రజలు గమనించాలని సూచించారు.
క్రీడాకారుల ప్రతిభ, కృషి, అర్హతల ఆధారంగానే వారికి అవకాశాలు లభించాయని, దానికి కులాలను ఆపాదించడం అన్యాయమని బ్రహ్మంచౌదరి పేర్కొన్నారు. యువత సాధించిన విజయాలను ప్రోత్సహించాల్సిన సమయంలో వాటిని వివాదాలుగా మార్చడం సరికాదన్నారు.
కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. సమాజంలో ఐక్యతను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతిభకు, కష్టానికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని, యువతను ప్రోత్సహించే వాతావరణం కల్పించడం అందరి బాధ్యత అని నాదెండ్ల బ్రహ్మంచౌదరి తెలిపారు.
Be the first to react