LIVE
World History: ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు.. ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! ఆ దేశం ఎక్కడుంది?  •  Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  • 
Politics

AP Free Sanitary Napkins Scheme: విద్యార్థినులకు గుడ్ న్యూస్.. 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు!

Free Sanitary Napkins Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గత ప్రభుత్వ బకాయిలు రూ.18.96 కోట్లను చెల్లించామని, నాణ్యమైన ప్యాడ్…

AndhraPravasi News Desk 1 min read
AP Free Sanitary Napkins Scheme: విద్యార్థినులకు గుడ్ న్యూస్.. 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు!

Andhra Pradesh Education:  రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లను పంపిణీ చేస్తున్నట్లు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనమండలి వేదికగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి  నారా లోకేష్ వెల్లడించారు.

పాత బకాయిల చెల్లింపు.. నాణ్యతకు ప్రాధాన్యం

గత ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి దాదాపు రూ.18.96 కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని, బాధ్యత గల ప్రజా ప్రభుత్వంగా తాము ఆ బకాయిలన్నింటినీ క్లియర్ చేశామని లోకేష్ స్పష్టం చేశారు. కేవలం పంపిణీ చేయడమే కాకుండా, విద్యార్థినుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఆర్టీజీఎస్  ద్వారా ఫోన్ కాల్స్ చేసి అడగగా.. 96 శాతం మంది బాలికలు తమకు సక్రమంగా అందుతున్నాయని చెప్పారని, నాణ్యత విషయంలో కూడా 85 శాతం మంది పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. విద్యార్థినుల కోరిక మేరకు గతంలో ఇచ్చే సైజుల సంఖ్యను మార్చి, ఇప్పుడు 5 రెగ్యులర్, 5 లార్జ్ సైజ్ ప్యాడ్లను అందజేస్తున్నట్లు వివరించారు.

ఆధునిక పద్ధతులు - ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్లు

బాలికల సౌకర్యం కోసం కేజీబీవీ పాఠశాలల్లో ఇప్పటికే 'స్మార్ట్ కార్డ్' ఆధారిత వెండింగ్ మిషన్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టామని, త్వరలోనే వీటిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు విస్తరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసే 'ఎకో ఫ్రెండ్లీ' శానిటరీ ప్యాడ్ల పంపిణీపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీనిపై ఎన్జీవోలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హెచ్‌పీవీ  వ్యాక్సిన్‌పై ప్రత్యేక అవగాహన

మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని లోకేష్ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…