Header Banner

అవును ఆ ఇంటికి వెళ్లాను..! వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!

  Tue May 27, 2025 08:09        Politics

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అమ్ముడుపోయారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం సంచలన వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత టీడీ జనార్ధన్‌తో విజయసాయి రెడ్డి రహస్య మంతనాలు అంటూ వైసీపీ ఆదివారం సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఆరోపణలకు విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. తాను సైలెంట్‌గా ఉండటం వైసీపీలో కోటరీకి నచ్చడం లేదన్న విజయసాయి రెడ్డి.. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

నేను మౌనంగా ఉండడం వైయస్సార్సీపీలో కోటరీకి నచ్చటం లేదు. అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం, ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ.. జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు సంబంధంలేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దామని కోటరీ నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్ళుగా అవమానిస్తున్నందున, లేని అభాండాల్ని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. " అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

"2011లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025లో కూడా జగన్ గారే అడిగి ఉంటే (కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా) సంబంధం లేకున్నా బాథ్యత తీసుకుని ఉందేవాడినేమో. కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా అ కుటుంబానికి సేవచేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్‌గారు పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెస్నుపోటుదారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా?" అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నిచారు.

మరోవైపు టీడీపీ నేత టీడీ జనార్ధన్‌ను కలిశారనే ఆరోపణలపై విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లానన్న విజయసాయిరెడ్డి.. తనకు కృష్ణగారి కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. వారందరూ కూడా తన కుమార్తె వివాహానికి వచ్చారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తాను ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లిన సమయంలోనే టీడీ జనార్ధన్, వారి ఇంటికి వస్తున్న విషయం తనకు తెలియదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

"నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని, చంద్రబాబుగారినే కలుస్తా .. వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను. వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేసు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే, ఆ స్కాం రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేసు ఆ పార్టీ నాయకుల్ని కలిశా అని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి, స్కామ్ లేనప్పుడు, నేను ఏం చర్చిస్తాను. స్కాం గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరిని నేను ప్రస్తావించలేదు" అంటూ విజయసాయిరెడ్డి సుదీర్ఘ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!


ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #VijayasaiReddy #YSRCP #PoliticalControversy #ViralVideo #SensationalTweet #AndhraPolitics