గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో గురువారం, జూన్ 12, 2025న మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ విమానాశ్రయ సమీపంలోని మేఘాని నగర్ అనే నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తున్నట్లు కొన్ని అనధికారిక వార్తలు వెలువడుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 విమానం 232 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా మొత్తం 244 మందితో లండన్కు పయనమైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డైరెక్టర్ జనరల్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపారు.
ఇది కూడా చదవండి: అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం! ఫ్లైట్ లో 242 మందికి పైగా..
ప్రమాద విషయం తెలిసిన వెంటనే విమానాశ్రయంలో అత్యవసర సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రమాద స్థలం నుంచి దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలు స్థానిక టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. విమాన ప్రయాణ సమాచారాన్ని అందించే ఫ్లైట్రాడార్24 వెల్లడించిన ప్రాథమిక ఏడీఎస్-బి డేటా ప్రకారం, ఏఐ171 విమానం గరిష్టంగా 625 అడుగుల (విమానాశ్రయ ఎత్తు సుమారు 200 అడుగులు) బారోమెట్రిక్ ఎత్తుకు చేరుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత హఠాత్తుగా నిమిషానికి -475 అడుగుల వేగంతో కిందకు దిగడం ప్రారంభించిందని సమాచారం. బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం ఒక వైడ్బాడీ, రెండు ఇంజన్లు కలిగిన అత్యాధునిక విమానం. ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ డేటాబేస్ ప్రకారం, బోయింగ్ 787 రకం విమానానికి ప్రపంచ చరిత్రలో ఇదే మొట్టమొదటి ప్రమాదం కావడం గమనార్హం. ఈ దుర్ఘటనకు గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ ఇండియాటుడే. ఇన్ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, ఈ వార్తలపై అధికారిక వర్గాల నుంచి ఎటువంటి ధృవీకరణ ఇంకా వెలువడలేదు. ఆయన ప్రయాణంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తల నేపథ్యంలో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అధికారులు ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్న్యూస్.. కొత్తగా పింఛన్లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: