ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని హాజరుకానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది. మే 2వ తేదీ అమరావతికి మోదీ రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను మోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగసభ వేదికను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదిక నుంచే పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మోదీ నిర్వహించనున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!
ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?
వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!
నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్కు కూడా..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: