Iconic Bridge: ఏపీకి మరో మణిహారం! 5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి! డిజైన్‌ను మీరే ఎంపిక చేయొచ్చు!

జగనన్న కాలనీల్లో భారీ అవినీతి బాగోతం బయటపడుతోంది. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి, కోట్లాది రూపాయలను దోపిడీ చేసిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ కుటుంబ సభ్యుల ఆధీనంలోని రాక్రీట్ కంపెనీ కీలక పాత్ర పోషించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీకి గత ప్రభుత్వం రూ.80 కోట్లకు పైగా నిధులు కేటాయించిందని సమాచారం. అయితే ఈ నిధులు నిజంగా పేదల గృహాల కోసం వినియోగించబడి ఉంటే, వేలాది ఇళ్లు పూర్తయ్యేవని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Chandrababu: చంద్రబాబుకు సరికొత్త హెలికాప్టర్! ఆ ఒక్క కారణంగానే ఈ కీలక నిర్ణయం!

‘ఆప్షన్-త్రీ’ పేరుతో పేదలకు గృహాలు కట్టిస్తామంటూ ప్రాజెక్టులు చేపట్టినట్టు చూపించి, పునాదుల దశలోనే కోట్ల రూపాయలను మాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్న గృహాలు కాగితాల మీదే ఆగిపోయాయి. కానీ నిధులు మాత్రం వ్యక్తిగత లాభాల కోసం దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు పెరుగుతున్నాయి. దీంతో నిజంగా ఈ అవినీతి వెనుక ఉన్న ముసుగులు క్రమంగా తొలగుతున్నాయి.

LPG: ఏపీలో గిరిజనులకు శుభవార్త..! 23,912 కుటుంబాలకు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు!

జగన్ హయాంలోనే రాక్రీట్ సంస్థ అవినీతి గురించి అనేక ఫిర్యాదులు అధికారుల దృష్టికి వెళ్లాయి. కానీ ఆ సమయంలో ప్రభుత్వం పెద్దగా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. స్థానికంగా లబ్ధిదారులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా, విచారణ ముందుకు సాగలేదని తెలుస్తోంది. దీని వలన అవినీతి మరింత పెరిగి, పేదలకు కట్టాల్సిన ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయి.

Flipkart: సెప్టెంబర్ 23 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్..! టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు!

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాక్రీట్ కంపెనీ ఆర్థిక లావాదేవీలపై, నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ఉన్న నిజాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పేదల కలల ఇళ్ల పేరుతో జరిగిన ఈ దోపిడీపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.

Giorgio Armani: ఫ్యాషన్ ప్రపంచంలో ఒక లెజెండ్‌కు వీడ్కోలు.. జార్జియో అర్మానీ!
Airport: రేణిగుంట విమానాశ్రయంలో ఉద్రిక్తత..! స్పైస్ జెట్ సర్వీసు రద్దుతో ప్రయాణికుల నిరసన!
AP IAS Officer: హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ IAS అధికారి అమానుషం! అసలేం జరిగిందంటే!
Security experts warn: గ్యాలరీలో ఈ ఫొటోలు పెట్టుకుంటున్నారా.. సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక!
Lokesh angry: వైకాపా తీరుపై లోకేశ్ ఆగ్రహం.. టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం!
Indian Railways: ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం.. ఇకపై ట్రైన్‌లో అలా చేస్తే రూ.1,000ల జరిమానా!