రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు భాషా పండితులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు (మ్యూచువల్, స్పౌజ్) విజయవంతంగా పూర్తయినందుకు ఏళ్లుగా ఎదురు చూస్తున్న భాషా పండితుల పదోన్నతులు పరిష్కరించినందుకు ఉపాధ్యాయులు మంత్రి నారా లోకేష్గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యా శాఖలో తొలి ఏడాదిలోనే అవసరమైన సంస్కరణలు పూర్తి చేశాం. ఇప్పుడు వచ్చే నాలుగేళ్లు ఫలితాలపై దృష్టి సారిస్తాం. గత ప్రభుత్వంలా విద్యార్థులను డ్రాప్బాక్స్లలో వేసి తప్పుడు లెక్కలు చూపించిన విషయం అందరికీ తెలిసిందే. మన ప్రభుత్వం పారదర్శకతతో పని చేస్తాం. విద్యాశాఖను ఒక సవాల్గా తీసుకున్నాం. విద్యను రాజకీయాల కంటే గొప్పదిగా భావిస్తున్నాం అన్నారు.
ఏపీలో విద్యావ్యవస్థను దేశంలోనే నంబర్ వన్గా మార్చడమే మా లక్ష్యం. ప్రతి ఉపాధ్యాయుడు ఈ మార్పులో భాగం కావాలి. మీరు బోధనతో పాటు విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచించాలి. విద్యార్థుల అభ్యసన ఫలితాలు తగ్గిపోవడాన్ని అరికట్టేందుకు మేము ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి విద్యా ప్రమాణాలు పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు.
అదేవిధంగా 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాం. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం. ఈ విధంగా ప్రతి ప్రక్రియలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధ్యాయుల సహకారం ఉంటే ఏపీ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకురాగలమని నమ్మకం ఉందని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత ఉపాధ్యాయులు మంత్రి లోకేష్ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.