Tariffs: చైనా దిగుమతులపై 100% టారిఫ్‌లు.. ట్రంప్ నిర్ణయం హీటెక్కిన వాణిజ్య యుద్ధం!

పల్నాడు జిల్లా ప్రజల్లో అరుదైన “మెలియాయిడోసిస్” వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. వెల్దుర్తి మండలం దావులపల్లి తండాకు చెందిన ఓ వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య అధికారులు గుర్తించారు. ఈ సమాచారం అందిన వెంటనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (DMHO) ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం ఆ గ్రామానికి చేరి పరిస్థితులను సమీక్షించింది. గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ, భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.

పాఠశాలల్లో యూపీఐ విప్లవం: స్కూల్ ఫీజులు ఇకపై డిజిటల్‌గానే.. కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు!

వైద్య నిపుణుల ప్రకారం, మెలియాయిడోసిస్ సాధారణంగా బురద, కలుషిత నీరు లేదా నేలలో ఉన్న బ్యాక్టీరియా (Burkholderia pseudomallei) ద్వారా మనుషులకు సోకుతుంది. ఇది నేరుగా వ్యక్తి నుంచి వ్యక్తికి సంక్రమించదు, అందువల్ల ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే, మట్టిలో పనిచేసే రైతులు, కార్మికులు లేదా గాయాలతో ఉన్నవారు ఈ బ్యాక్టీరియాకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Train Emergency Chain: రైలులో చైన్ లాగితే రైలు ఆగడం తెలుసా? ప్రయాణికుల కోసం ప్రత్యేక గైడ్..!

ప్రభుత్వ వైద్యాధికారులు తెలిపారు, ఈ వ్యాధి మొదట జ్వరంగా, కండరాల నొప్పిగా, అలసటగా ప్రారంభమవుతుంది. కొంతకాలం నిర్లక్ష్యం చేస్తే  ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వ్యాపించి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా డయాబెటీస్, లివర్ వ్యాధులు లేదా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.

DSC Notification: సర్కార్‌ కీలక నిర్ణయం..! DSC నియామకాలు, టెట్, స్పెషల్ DSC నోటిఫికేషన్‌కు ముహూర్తం ఫిక్స్..!

DMHO డాక్టర్ పర్యవేక్షణలో దావులపల్లి తండాలో సర్వే నిర్వహించి, గ్రామ ప్రజలకు పరిశుభ్రత, మురుగు నీరు, చెత్త నిల్వలపై ప్రత్యేక సూచనలు ఇచ్చారు. నీటి మూలాలు, బురద ప్రాంతాలు, పశువుల షెడ్లు వంటి ప్రాంతాలను శుభ్రపరిచే పనులు చేపట్టారు. పర్యావరణంలో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా క్లోరినేషన్, ఫాగింగ్, శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టారు.

Chittor: చిత్తూరు లో కలకలం! గుప్తనిధుల తవ్వకాల కేసులో వైసీపీ జిల్లా కార్యదర్శి అరెస్టు!

ప్రభుత్వం తరఫున ప్రజలకు జాగ్రత్త సూచనలు కూడా జారీ అయ్యాయి. చేతులు తరచుగా కడుక్కోవాలి. మట్టి, బురద, చెత్త నీటిలో నేరుగా తాకకూడదు. గాయాలు ఉంటే వాటిని కప్పుకుని బయటకు వెళ్లాలి. జ్వరం లేదా శరీర నొప్పి కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. మెలియాయిడోసిస్ వ్యాధి సాధారణంగా దక్షిణ ఆసియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, మలేసియా వంటి తడిగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో ఇది అరుదైనదే అయినా, మట్టిలో ఎక్కువగా పని చేసే రైతులు, వ్యవసాయ కార్మికులుకి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్న..టీమిండియా!!

దావులపల్లి తండాలో ఈ వ్యాధి కేసు వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. వైద్య శాఖ “పానిక్ అవసరం లేదు, పరిస్థితి నియంత్రణలో ఉంది” అని వెల్లడించింది. రోగి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు సమాచారం. జీవనశైలి, పరిశుభ్రత, మరియు జాగ్రత్తలతో ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా ప్రజలకు ఆరోగ్య శాఖ విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదమని, జాగ్రత్తే మెలియాయిడోసిస్‌కి సరైన ఔషధమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

"ఆమె యంగ్, అందుకే మీకీ సమస్య.. స్నేహం మాత్రమే శాశ్వతం!" పూరి జగన్నాథ్ ఘాటు వ్యాఖ్యలు!
APCRD : ఫర్నిచర్, గార్డెన్, శానిటేషన్ పనులు పూర్తి.. APCRD ప్రారంభానికి సిద్దం!
వరల్డ్ రికార్డ్ రైలు ప్రయాణం: 21 రోజులు, 13 దేశాలు.. 18,755 కి.మీ.లు! టికెట్ ధర ఎంతంటే?
Fire Accident: నెల్లూరు హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం! పోలీసుల దర్యాప్తు ప్రారంభం!
NTR Health Scheme: ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్‌..! బకాయిల చెల్లింపులపై నెట్‌వర్క్ ఆస్పత్రుల ఆందోళన..!
రక్షణ, వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యంపై.... అమెరికా రాయబారి కీలక చర్చలు!! !!