Chittor: చిత్తూరు లో కలకలం! గుప్తనిధుల తవ్వకాల కేసులో వైసీపీ జిల్లా కార్యదర్శి అరెస్టు!

మన దేశంలో డిజిటల్ విప్లవం ఎంత వేగంగా విస్తరించిందో మనందరికీ తెలుసు. వీధి చివర్లో ఉన్న చిరు వ్యాపారి దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు.. అందరూ ఇప్పుడు యూపీఐ (UPI) ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే, పాఠశాలల్లో ఫీజుల వసూలు ప్రక్రియను కూడా ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

DSC Notification: సర్కార్‌ కీలక నిర్ణయం..! DSC నియామకాలు, టెట్, స్పెషల్ DSC నోటిఫికేషన్‌కు ముహూర్తం ఫిక్స్..!

పారదర్శకతను పెంచడంతో పాటు, ఫీజుల చెల్లింపును సులభతరం చేసేందుకు యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపులకు ఆదరణ పెరుగుతున్న వేళ, విద్యారంగంలో ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి.

ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్న..టీమిండియా!!

ఆధునిక సాంకేతిక విధానాలను అవలంబించడం ద్వారా పాఠశాలల నిర్వహణను సులభతరం చేయాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలు, సంబంధిత విభాగాలకు కేంద్రం లేఖ రాసింది. ఈ జాబితాలో ఎన్సీఈఆర్టీ (NCERT), సీబీఎస్ఈ (CBSE), కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) వంటి సంస్థలు కూడా ఉన్నాయి.

"ఆమె యంగ్, అందుకే మీకీ సమస్య.. స్నేహం మాత్రమే శాశ్వతం!" పూరి జగన్నాథ్ ఘాటు వ్యాఖ్యలు!

కేవలం ఫీజులు మాత్రమే కాదు, అడ్మిషన్, ఎగ్జామ్ ఫీజుల వసూలుకు వీలు కల్పించే డిజిటల్ విధానాలను అన్వేషించి, అమలు చేయాలని సూచించింది. నగదు ఆధారిత చెల్లింపుల నుంచి డిజిటల్‌కు మారడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ తన ప్రకటనలో స్పష్టంగా చెప్పింది:

APCRD : ఫర్నిచర్, గార్డెన్, శానిటేషన్ పనులు పూర్తి.. APCRD ప్రారంభానికి సిద్దం!

ఫీజుల చెల్లింపు కోసం స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే లేదా ఎక్కడి నుంచైనా సులభంగా కట్టేయవచ్చు. ఇది ముఖ్యంగా ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు, దూరం ఉండే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో పూర్తి పారదర్శకత (Transparency) సాధ్యమవుతుంది. ఎక్కడ, ఎంత డబ్బు వసూలు చేశారు అనే దానిపై స్పష్టత ఉంటుంది.

వరల్డ్ రికార్డ్ రైలు ప్రయాణం: 21 రోజులు, 13 దేశాలు.. 18,755 కి.మీ.లు! టికెట్ ధర ఎంతంటే?

పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్లాల్సిన, లెక్క పెట్టాల్సిన అవసరం తప్పుతుంది కాబట్టి, లావాదేవీలు మరింత సురక్షితంగా ఉంటాయి. 'డిజిటల్ భారత్' సాధన దిశగా ఇటువంటి చర్యలు తోడ్పడతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

Fire Accident: నెల్లూరు హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం! పోలీసుల దర్యాప్తు ప్రారంభం!

పాఠశాలల స్థాయిలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఉంది. ఈ ప్రక్రియ ఆర్థిక అక్షరాస్యత (Financial Literacy) మెరుగుదలకు సహాయపడుతుంది. పిల్లలు, వారి తల్లిదండ్రులు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి విధానాలను ఉపయోగించడం నేర్చుకోవడం ద్వారా, వారిలో డిజిటల్ లావాదేవీలపై అవగాహన, విశ్వాసం పెరుగుతాయి. తద్వారా డిజిటల్ లావాదేవీలు మరింత విస్తృతం అవుతాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.

జుట్టు రాలుతుందా? ఆందోళన అవసరం లేదు – ఇలా చేస్తే మళ్లీ ఒత్తయిన జుట్టు మీ సొంతం!!

ఇకపై ఫీజుల కోసం సెలవు రోజుల్లో కూడా స్కూల్‌కు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. స్కూల్ మేనేజ్‌మెంట్లు కూడా ఈ విధానాన్ని త్వరగా అమలు చేస్తే, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇద్దరికీ సమయం ఆదా అవుతుంది, పని ఒత్తిడి తగ్గుతుంది అనడంలో సందేహం లేదు.

Afghanistan-Pak: ఆఫ్ఘానిస్థాన్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత..! తాలిబన్ల ప్రతీకార దాడుల్లో 15 మంది పాక్ సైనికులు మృతి..!
వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు సంబంధించిన మరిన్ని విషయాలు!!
Mississippi Shooting: అమెరికాలోని మిసిసిపీలో భయంకర కాల్పులు! 4 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు!
Cement Leases: సిమెంట్ దిగ్గజాలకు ఏపీ సర్కార్ షాక్..! ఆ లీజులు రద్దు దిశగా అడుగులు..!
Glass Break: మదురై-చెన్నై రూట్‌లో భయంకర ఘటన! పగిలిన విమానం అద్దం... 76 మందికి!
రక్షణ, వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యంపై.... అమెరికా రాయబారి కీలక చర్చలు!! !!
NTR Health Scheme: ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్‌..! బకాయిల చెల్లింపులపై నెట్‌వర్క్ ఆస్పత్రుల ఆందోళన..!
Old phone : పాత ఫోనే కదా అని అమ్ముతున్నారా అయితే తస్మా జాగ్రత్త.. చిక్కుల్లో పడ్డట్లే!