ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్న..టీమిండియా!!

చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు నిర్వహించిన ఘటన పెద్ద సంచలనం రేపింది. ఈ కేసులో వైసీపీ జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు చిత్తూరు జిల్లా వీర్పల్లి అటవీప్రాంతంలో రాత్రివేళ తవ్వకాలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు.

DSC Notification: సర్కార్‌ కీలక నిర్ణయం..! DSC నియామకాలు, టెట్, స్పెషల్ DSC నోటిఫికేషన్‌కు ముహూర్తం ఫిక్స్..!

గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో జేసీబీ యంత్రం, కారు, నాలుగు బైకులు, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్రమ తవ్వకాలను నిలిపివేసి, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

"ఆమె యంగ్, అందుకే మీకీ సమస్య.. స్నేహం మాత్రమే శాశ్వతం!" పూరి జగన్నాథ్ ఘాటు వ్యాఖ్యలు!

ఈ ఘటనలో ఇద్దరు స్వామీజీలు మరియు మరొక ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంనుంచి పరారైనట్లు సమాచారం. పోలీసులు వారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా, తవ్వకాలు జరిగిందని అనుమానించిన ప్రదేశాన్ని పూర్తిగా మూసివేసి, భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు.

APCRD : ఫర్నిచర్, గార్డెన్, శానిటేషన్ పనులు పూర్తి.. APCRD ప్రారంభానికి సిద్దం!

నిందితుల్లో ముగ్గురు పుంగనూరు మండలం జంటపల్లె వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేయడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

వరల్డ్ రికార్డ్ రైలు ప్రయాణం: 21 రోజులు, 13 దేశాలు.. 18,755 కి.మీ.లు! టికెట్ ధర ఎంతంటే?
Fire Accident: నెల్లూరు హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం! పోలీసుల దర్యాప్తు ప్రారంభం!
జుట్టు రాలుతుందా? ఆందోళన అవసరం లేదు – ఇలా చేస్తే మళ్లీ ఒత్తయిన జుట్టు మీ సొంతం!!
Afghanistan-Pak: ఆఫ్ఘానిస్థాన్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత..! తాలిబన్ల ప్రతీకార దాడుల్లో 15 మంది పాక్ సైనికులు మృతి..!
వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు సంబంధించిన మరిన్ని విషయాలు!!
Credit card: క్రెడిట్ కార్డులు అనవసరం అయితే రద్దు చేయడం సురక్షితమేనా? స్కోర్‌పై పరిణామాలు ఏమిటి?