LIVE
World History: ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు.. ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! ఆ దేశం ఎక్కడుంది?  •  Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  • 
Politics

AP NRT: నవ్యాంధ్ర నిర్మాణంలో కీలక ఘట్టం.. ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతల స్వీకారం.!

Representative North America Komati Jayaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులను క్రియాశీల భాగస్వాములను చేస్తూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా శ్రీ కోమటి జయరాం గారు ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవీ బాధ్యతలు …

AndhraPravasi News Desk 3 min read
AP NRT: నవ్యాంధ్ర నిర్మాణంలో కీలక ఘట్టం.. ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతల స్వీకారం.!
  • నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రవాసాంధ్రుల పాత్ర: ఉత్తర అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతల స్వీకరణ!
     
  • అమెరికా ఎన్నారైలకు కొండంత అండ: ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జయరాం అపూర్వ ఘట్టం..

Representative North America Komati Jayaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులను క్రియాశీల భాగస్వాములను చేస్తూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా శ్రీ కోమటి జయరాం గారు ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని ఏపీఎన్నార్టీ (APNRT) కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో, వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ అపూర్వ ఘట్టానికి రాష్ట్ర ఎన్నారై శాఖామాత్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జయరాం గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆయనతో పాటు ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు శ్రీ వేమూరి రవి, సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ శ్రీ రవి మండలపు, ప్రముఖ ఎన్నారై డాక్టర్ శ్రీ రాజా పిల్లి, టీడీపి ఎన్నారై ఇన్చార్జ్ రాజశేఖర్ గారు, గంప కృష్ణ మరియు వివిధ దేశాల నుంచి తరలివచ్చిన ఎన్నారై ప్రతినిధులు జయరాం గారి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కోమటి జయరాం గారి నియామకం రాష్ట్రానికి ఒక శుభపరిణామమని కొనియాడారు. జయరాం గారు కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న లక్షలాది మంది తెలుగు వారికి ఒక భరోసా అని, గతంలో ఆయన చేసిన సేవలు అమోఘమని మంత్రి ప్రశంసించారు. ముఖ్యంగా డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో జయరాం గారు చూపిన చొరవ అభినందనీయమని, ఇప్పుడు మళ్ళీ ఆయన బాధ్యతలు చేపట్టడం వల్ల అమెరికా నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడమే కాకుండా, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు, ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా తక్షణ పరిష్కారం లభిస్తుందనే నమ్మకం తమకు ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ఐదేళ్ల అరాచక పాలన తర్వాత రాష్ట్రం చంద్రబాబు గారి నేతృత్వంలో 'జెట్ స్పీడ్'తో దూసుకుపోతోందని, ఈ క్రమంలో జయరాం గారి అనుభవం రాష్ట్రాభివృద్ధికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం కోమటి జయరాం గారు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్ల పాలనను అంతం చేయడంలో ఎన్నారై టీడీపి (NRI TDP) కార్యకర్తలు, నాయకులు చేసిన పోరాటం మరువలేనిదని గుర్తు చేస్తూ, ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

గతంలో 2014-19 మధ్య సుమారు 3,500 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడం, స్మశాన వాటికల అభివృద్ధి, అంగన్‌వాడీ భవనాల నిర్మాణంలో ఎన్నారైలను భాగస్వాములను చేసిన స్ఫూర్తితో, ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని ప్రకటించారు. అమరావతి, పోలవరం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏపీ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో, ప్రవాసాంధ్రులకు, ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన సంధానకర్తగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు శ్రీ వేమూరి రవి మాట్లాడుతూ, జయరాం గారి రాక ప్రవాసాంధ్రులకు కొండంత అండ అని, గతంలో పాఠశాలల డిజిటలైజేషన్ వంటి కార్యక్రమాల్లో ఆయన సాధించిన విజయం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ శ్రీ రవి మండలపు మాట్లాడుతూ.. అమెరికాలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఏపీకి మళ్ళించడంలో జయరాం గారి నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

అలాగే టీడీపి ఎన్నారై ఇన్చార్జ్ రాజశేఖర్ గారు మాట్లాడుతూ.. క్లిష్ట కాలంలో పార్టీ కార్యకర్తలను ఐక్యంగా ఉంచిన నాయకుడు జయరాం గారు అని, లోకేష్ గారి నాయకత్వంలో యువతను, సీనియర్లను సమన్వయం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ ఎన్నారై డాక్టర్ శ్రీ రాజా పిల్లి మాట్లాడుతూ, వైద్య, సామాజిక సేవా రంగాల్లో ఎన్నారైలను భాగస్వాములను చేయడంలో జయరాం గారి నిస్వార్థ కృషి ప్రవాస భారతీయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో.. చంద్ర కాజ, చందు గోటిపాటి, వెంకట్ కోగంటి, అనిల్ వీరపనేని, జితేంద్ర అతులూరి, మోహన్ ఎదర, వాసు కోనేరు, శ్రీకాంత్ దొడ్డపనేని, శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పెనపనేని, వెంకట జెట్టి, ఆళ్ళ వెంకట్, రాజా పిల్లి అమెరికా దేశా ప్రముఖులు ఇతర దేశాల ఎన్నారై లు పాల్గొన్నారు. అంతిమంగా, ఒక పక్కా రోడ్ మ్యాప్‌తో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలుపుతానని జయరాం గారు ఇచ్చిన హామీ నవ్యాంధ్ర నిర్మాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని హాజరైన ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…