మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్తో కలిసి విజయ్ కనకమేడల దర్శకత్వంలో భైరవం అనే సినిమాలో నటిస్తున్నారు. శ్రీ సత్య సాయి పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికర ఘటన జరిగింది. నారా రోహిత్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేయాలని మంచు మనోజ్ అన్నారు. రోహిత్ తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ మనోజ్ ఎందుకలా అన్నారంటే? భైరవం మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇటీవలే సినిమా బృందం ఓ ఇంటర్య్వూ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!
ఈ నేపథ్యంలో నారా రోహిత్, మంచుమనోజ్ కలిసి కారులో ఎక్కడికో బయలుదేరారు. డ్రైవింగ్ చేస్తున్న మనోజ్ పక్కనే రోహిత్ కూర్చూన్నారు. ఈ క్రమంలో ఒకచోట కారు ఆపి ఎవరితోనో మాట్లాడారు మనోజ్. వెంటనే సీఎం గారిని కలవాలి అని ఆ వ్యక్తిని అన్నారు. ఆవతలి వైపు నుంచి ఏదో సమాధానం వచ్చింది. దీంతో స్పందించిన మనోజ్- "సీఎం గారిని కలవాలి అర్జెంటుగా. ధర్నా చేస్తాం. ఇక్కడ చూడండి నారా రోహిత్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను నారా రోహిత్ కిడ్నాప్ చేస్తున్నారు" అని సరదాగా అన్నారు మంచు మనోజ్. పక్కనున్న రోహిత్ నవ్వుతూ ఉన్నారు. లాస్ట్లో- పొట్టలోపలికి తొయ్యి అని రోహిత్ను నవ్వుతూ అన్నారు మనోజ్. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుల్జార్హౌస్ ప్రమాద ఘటనపై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన!
ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!
జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!
ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్ లేకపోతే!
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: