Haj 2026: ఆంధ్రప్రదేశ్‌ హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్! ఇకపై మక్కాకు నేరుగా వెళ్లే అవకాశం..!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) సంస్థకు భూముల కేటాయింపు అంశంపై స్పందించింది. పెట్టుబడులు వచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదని, అలాంటి కంపెనీల రాకతో రాష్ట్రానికి కలిగే లాభాల దృష్టితో చూస్తే మంచిదని హైకోర్టు స్పష్టం చేసింది.

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే... తులం బంగారం ధర ఎంతంటే?

TCS‌కి భూమి కేటాయింపు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని, ఈ సమయంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు కలిగించే సంస్థలు కీలకమని వ్యాఖ్యానించింది.

APSDMA: ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద... APSDMA అలర్ట్!

“ధర ఎంత అనే దానికంటే లాభం ఎంత అన్నదే ముఖ్యం”
ప్రభుత్వం తక్కువ ధరకు భూమి ఇవ్వడం తప్పు కాదని, TCS‌ వంటి సంస్థలు వస్తే భారీగా ఉద్యోగాలు వస్తాయని కోర్టు పేర్కొంది. "హైదరాబాద్, బెంగళూరు ఐటీ రంగంలో ఎలా అభివృద్ధి చెందాయో మనకందరికీ తెలుసు. అలాంటిదే ఇక్కడ జరిగితే మంచిదే" అని హైకోర్టు అభిప్రాయపడింది.

Pawan kalyan: పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.. మరోసారి గిరిజనుల పట్ల ప్రేమ చాటుకున్నారుగా! ఈసారి ఏం పంపారంటే!

భూమి అమ్మకం కాదు, లీజు: ప్రభుత్వం వివరణ
ప్రభుత్వం తరఫు లాయర్ హైకోర్టులో ఇచ్చిన వివరాల ప్రకారం, విశాఖపట్నంలో 21.16 ఎకరాల భూమిని TCS‌కి అమ్మడం కాదు, లీజుకు ఇస్తున్నామని తెలిపారు. ఒక్కో ఎకరాకు 99 పైసల చొప్పున ఈ లీజ్‌ కేటాయింపుపై హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

NPCI: త్వరలో UPI కొత్త ఫీచర్స్! కంటిచూపుతోనే క్యాష్ ట్రాన్సాక్షన్స్!

పిటిషన్‌ వివరాలు
TCS‌కు తక్కువ ధరకు భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ‘సొసైటీ ఫర్ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రాపర్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ రైట్స్‌’ (SPCPER) సంస్థ అధ్యక్షుడు నక్కా నమ్మి పిటిషన్ దాఖలు చేశారు. రూ.529 కోట్ల విలువ ఉన్న భూమిని కేవలం తక్కువ ధరకు సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

Land Allocation: ఏపీలో లులు మాల్స్ ఏర్పాటు..! భూముల కేటాయింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!

తుది తీర్పు వరకు కేటాయింపు అమలుకు బ్రేక్ లేదు
ఈ అంశంపై తుది తీర్పు వచ్చేవరకు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కేటాయింపులు మాత్రం తుది తీర్పుకు లోబడి ఉంటాయని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ఉన్నారు.

Jagan Arrest: జగన్ అరెస్ట్ కు కౌంట్‌డౌన్! లిక్కర్ స్కాంలో ఈడీ సంచలనం... A1 నిందితుడి కీలక సమాచారం!
Appsc recruitment: ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..! ప్రభుత్వ కీలక ఉత్తర్వులు..!
New Railway line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! ఈ రూట్‌లోనే... ఇక 2 గంటల్లో కర్ణాటక!!
Tulasi Mahatyam: శ్రీవారి భక్తులకు శుభవార్త! తులసి మహత్యం ఉత్సవానికి ముహూర్తం ఫిక్స్.. టైమింగ్స్ ఇవే!