LIVE
World History: ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు.. ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! ఆ దేశం ఎక్కడుంది?  •  Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  • 
Politics

New Ration Card Application: రేషన్ కార్డు కావాలా? అయితే వెయిట్ చేయక్కర్లేదు.. సీఎం కొత్త ప్లాన్ ఇదే!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రేషన్ కార్డుల జారీ ఇకపై నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, 99 రోజుల పాటు 'ప్రజా పాలన' కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు.

AndhraPravasi News Desk 2 min read
New Ration Card Application: రేషన్ కార్డు కావాలా? అయితే వెయిట్ చేయక్కర్లేదు.. సీఎం  కొత్త ప్లాన్ ఇదే!

99 రోజుల పాటు 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక

విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక ఫోకస్

సాంకేతికతతో ఇంటి వద్దకే సేవలు

తెలంగాణలోని పేదలకు రేవంత్ సర్కార్ మరో తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు అనేది ఒక పండుగలా కాకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతర ప్రక్రియ'గా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. అంటే, ఇకపై రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఎప్పుడైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నారు.

రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకే తీసుకెళ్లేందుకు 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం మార్చి 6వ తేదీన ప్రారంభమై, జూన్ 12 వరకు.. అంటే దాదాపు 99 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఈ 99 రోజుల ప్రణాళికను అత్యంత బాధ్యతగా అమలు చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పరిపాలనలో భారీ మార్పులు తీసుకురావాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలు చిన్న చిన్న పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మెజారిటీ సేవలను ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే పొందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా వంద మండలాల్లో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌'ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడం ద్వారా పేదలకు నాణ్యమైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారందరికీ ప్రాధాన్యత ఇచ్చి, లబ్ధి చేకూర్చాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…