తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు తులాభారంలో సమర్పించే కానుకలు, నాణేలు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో వాటాలేసుకుని తినేశారని టీటీడీ బోర్డు సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమలలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఏది జరగకూడదు, ఏది జరగదని భావించామో అవన్నీ గత ప్రభుత్వంలో జరిగాయని అన్నారు. ‘వారం.. నెల వయస్సు ఉన్న బిడ్డలను కూడా తిరుమలకు తీసుకువచ్చి నాణేలు, చక్కర, బియ్యం, కలకండ, నెయ్యి వంటి వాటితో తులాభారం వేసి స్వామికి సమర్పిస్తారు. ఇలా రోజుకు దాదాపు రూ.10 లక్షలు తులాభారం ద్వారా శ్రీవారికి కానుకలు అందుతున్నాయి ఇందులో భారీగా అక్రమాలు జరిగినట్టు నా దృష్టికి వచ్చింది.’ అని ఆరోపించారు. రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆలయం నుంచి బయటకు తరలించారనే సమాచారం ఉందని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి తప్పుచేసిన, సమర్థించిన, తప్పించిన వారిని త్వరలోనే జైలుకు పంపుతామని చెప్పారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!
నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్కు కూడా..!
ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!
సీఆర్డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!
వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?
వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..
వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: