Microwave oven: మైక్రోవేవ్ ఓవెన్ వాడకం.. ఆరోగ్య సమస్యలకా? నిపుణుల హెచ్చరికలు ఇవే..!

మాజీ సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సీఎంఆర్ఎఫ్ (CMRF) నిధులను దారితప్పించి పేద ప్రజలకు అన్యాయం చేశారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో గురువారం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా 82 మంది లబ్ధిదారులకు రూ.61 లక్షల విలువైన చెక్కులను స్వయంగా అందజేశారు.

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్డమ్ థియేటర్లలో విడుదల.... మిక్స్‌డ్ టాక్!

మంత్రి నిమ్మల మాట్లాడుతూ, “జగన్ పాలనలో పేదలకు వైద్య సాయం అందించే సీఎంఆర్ఎఫ్ నిధులను నిర్లక్ష్యం చేసి, మానవత్వాన్ని పూర్తిగా మరిచారు. ఇప్పటికీ ఆయన రాష్ట్రంలో మిగిలిపోయిన వనరులను దోచుకోవడానికే కృషి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తుపై జాగ్రత్త లేకుండా వ్యవహరించారు. చేసిన తప్పులకు ఆయన ఎప్పటికీ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అందువల్ల ప్రజలు ఆయనను క్షమించరు” అని మండిపడ్డారు.

Formers: ఆ ఏరియాల్లో కొత్త పథకం..! మూడు సంవత్సరాల్లో 2.10 లక్షల రైతులకు ప్రయోజనం లక్ష్యంగా..!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం కష్టతరంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మానవత్వాన్ని ప్రదర్శిస్తూ సీఎంఆర్ఎఫ్ నిధిని తిరిగి పునరుద్ధరించారని ఆయన గుర్తుచేశారు. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా కూటమి ప్రభుత్వం క్లియర్ చేసిందని వివరించారు.

National Highway: ఏపీలో కొత్త నేషనల్ హైవే! నాలుగు లైన్లుగా.. రూ.2500 కోట్లతో ఈ రూట్‌లోనే! ఇక దూసుకెళ్లిపోవచ్చు!

గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, అభివృద్ధిని పూర్తిగా ఆపేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. “చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదల కోసం ప్రతి అడుగూ వేస్తోంది. ప్రతి కుటుంబానికి సాయం అందించేందుకు కట్టుబడి ఉంది. ఇకపై పేదలకు వైద్య సాయం అడ్డంకులు లేకుండా అందుతుంది” అని హామీ ఇచ్చారు.

New rule: నో హెల్మెట్.. నో పెట్రోల్.... ఆ ప్రాంత వాసులకు కొత్త నిబంధన!
Free bus: ఏపీలో ఉచిత బస్సు వేళ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..! నేటి నుంచే..!
High Court Judges: హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం.. ఈ కార్యక్రమానికి..
Star Heroine: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్! అసలు ప్లాన్ అదే!
F-35: అమెరికాలో కూలిన యుద్ధ విమానం..! ఎఫ్ 35 జెట్ క్రాష్..!