Smartphones: స్మార్ట్‌ఫోన్ పాడైతే బియ్యం, టేపులే దిక్కా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!

Smartphones: స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు భారతీయుల రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారింది. ఫోన్ కిందపడినా, నీటిలో తడిసినా చాలామంది వెంటనే సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఏదో ఒక పరిష్కారం ప్రయత్నిస్తున్నారు. తాజాగా వెలువడిన ఒక వినియోగదారుల అధ్యయనం భారతీయుల స్మార్ట్‌ఫోన్ వినియోగం, ప్రమాదాలు, రక్షణ ప్లాన్లపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Smartphones
Smartphones

భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ప్రొటెక్షన్ క్రైసిస్.. యాక్టివ్ ప్లాన్ ఉన్నది కేవలం 6–8% మందికే..

26–30 ఏళ్ల వారే స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువ బానిసలు.. కొత్త సర్వేలో వెల్లడి..

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు భారతీయుల రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారింది. ఫోన్ కిందపడినా, నీటిలో తడిసినా చాలామంది వెంటనే సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఏదో ఒక పరిష్కారం ప్రయత్నిస్తున్నారు. తాజాగా వెలువడిన ఒక వినియోగదారుల అధ్యయనం భారతీయుల స్మార్ట్‌ఫోన్ వినియోగం, ప్రమాదాలు, రక్షణ ప్లాన్లపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

హన్సా రీసెర్చ్‌, వన్‌అసిస్ట్‌ కోసం నిర్వహించిన ‘ది గ్రేట్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ ప్రొటెక్షన్ క్రైసిస్’ అధ్యయనం ప్రకారం.. నీటితో దెబ్బతిన్న స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి పనిచేయించేందుకు 29 శాతం మంది బియ్యాన్ని ఉపయోగించినట్లు తెలిపారు. ఫోన్‌లోకి నీరు వెళ్లినప్పుడు బియ్యంలో పెట్టే పాత ఇంటి చిట్కా ఇప్పటికీ కొందరిలో కొనసాగుతున్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

82% మంది ఫోన్‌ను కనీసం ఒక్కసారైనా కింద పడేశారు
స్మార్ట్‌ఫోన్ ప్రమాదాలు ఎంత సాధారణంగా మారాయో అధ్యయనం వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది తమ ఫోన్‌ను కనీసం ఒక్కసారైనా కింద పడేసినట్లు చెప్పారు. అలాగే 72 శాతం మంది ఏదో ఒక రకమైన ప్రమాదవశాత్తు నష్టాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు.

స్క్రీన్ పగలడం, ఫోన్ కిందపడటం వంటి ఘటనలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. జేబు లేదా బ్యాగ్ నుంచి ఫోన్ జారిపడటం వల్లే 36 శాతం ప్రమాదాలు జరిగినట్లు నివేదిక పేర్కొంది.

ఫోన్ పగిలితే టెన్షన్.. గొడవలు కూడా!
స్మార్ట్‌ఫోన్ దెబ్బతిన్నప్పుడు వినియోగదారుల మానసిక స్పందనను కూడా అధ్యయనం పరిశీలించింది.
35 శాతం మంది ఫోన్ కిందపడగానే భయాందోళనకు గురయ్యారు.
24 శాతం మంది ఈ ఘటన కారణంగా ఎవరో ఒకరితో గొడవపడ్డామని చెప్పారు.
15 శాతం మంది ఫోన్ దెబ్బతినడంతో తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు తెలిపారు.
అంటే, ఫోన్ కేవలం కమ్యూనికేషన్ పరికరం మాత్రమే కాకుండా రోజువారీ జీవితంలో ఎంత ముఖ్యమైన భాగంగా మారిందో ఈ వివరాలు చెబుతున్నాయి.

మహిళల్లో ఫోన్ ప్రమాదాలు ఎక్కువ
స్మార్ట్‌ఫోన్ ప్రమాదాల విషయంలో మహిళలు, పురుషుల మధ్య కూడా తేడాలు కనిపించాయి. 94 శాతం మహిళలు తమ స్మార్ట్‌ఫోన్‌ను ప్రమాదవశాత్తు కింద పడేసినట్లు చెప్పారు. పురుషుల్లో ఈ శాతం 80గా ఉంది. అలాగే మహిళల్లో 79 శాతం మంది, పురుషుల్లో 71 శాతం మంది ఫోన్ దెబ్బతిన్న అనుభవాన్ని తెలిపారు.

ఫోన్ పడిపోయిన తర్వాత భయాందోళనకు గురైన మహిళల శాతం 43 కాగా, పురుషుల్లో అది 33 శాతంగా ఉంది. పిల్లలు లేదా పెంపుడు జంతువుల వల్ల ఫోన్ దెబ్బతిన్న ఘటనలను కూడా మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువగా నివేదించినట్లు అధ్యయనం వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్ ప్రొటెక్షన్ ప్లాన్లకు ఆదరణ తక్కువ 
ఫోన్ నష్టం తరచూ జరుగుతున్నప్పటికీ, దానికి రక్షణ కల్పించే ప్లాన్ల వినియోగం మాత్రం తక్కువగానే ఉంది. అధ్యయనం ప్రకారం, తమ ఫోన్ వినియోగ కాలంలో ఏదో ఒక దశలో 36 శాతం మంది మాత్రమే స్మార్ట్‌ఫోన్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఉపయోగించారు. 

ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న రక్షణ ప్లాన్ల శాతం కేవలం 6–8 శాతం మధ్యే ఉంది. ప్రొటెక్షన్ ప్లాన్లను తీసుకోకపోవడానికి ప్రధాన కారణాలుగా ధర ఎక్కువగా ఉండటం, ప్లాన్ ప్రయోజనాలపై అవగాహన లేకపోవడం, క్లెయిమ్ ప్రక్రియపై సందేహాలు ఉన్నాయని నివేదిక తెలిపింది.

టేపులతో ఫోన్‌ను పట్టుకునే పరిస్థితి 
ఫోన్ దెబ్బతిన్న తర్వాత కొందరు వినియోగదారులు తాత్కాలిక పరిష్కారాలను ఆశ్రయిస్తున్నారని అధ్యయనం చెబుతోంది. నీటిలో తడిసిన ఫోన్‌కు బియ్యం ఉపయోగించిన వారితో పాటు 20 నుంచి 32 శాతం మంది టేప్ లేదా ఇతర తాత్కాలిక పద్ధతులను ఉపయోగించి పాడైన పరికరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

26–30 ఏళ్ల వారిలో స్మార్ట్‌ఫోన్‌పై ఎక్కువ ఆధారపడటం 
వయసు పరంగా చూస్తే 26–30 ఏళ్ల వయసు గల వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌పై అత్యధికంగా ఆధారపడుతున్న వర్గంగా అధ్యయనం గుర్తించింది. కమ్యూనికేషన్‌తో పాటు డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, వినోదం వంటి అనేక కార్యకలాపాలకు ఈ వయసు వారు స్మార్ట్‌ఫోన్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

పాత ఫోన్లకు రక్షణ ప్లాన్లపై ఆసక్తి 
రిఫర్బిష్డ్‌, ప్రీ-ఓన్డ్‌ స్మార్ట్‌ఫోన్ల వినియోగాన్ని కూడా అధ్యయనం పరిశీలించింది. కొత్త ఫోన్‌తో పోలిస్తే పాత లేదా ప్రీ-ఓన్డ్‌ ఫోన్లకు రక్షణ ప్లాన్ మరింత అవసరమని 70 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే 30 శాతం మంది వారంటీ లేదా ప్రొటెక్షన్ ప్లాన్ అందుబాటులో ఉంటే ప్రీ-ఓన్డ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

మెట్రో, నాన్-మెట్రో ప్రాంతాల్లో తేడా
ప్రీ-ఓన్డ్‌ ఫోన్ల కొనుగోలులో మెట్రో, నాన్-మెట్రో ప్రాంతాల మధ్య కూడా గణనీయమైన తేడా కనిపించింది. నాన్-మెట్రో ప్రాంతాల్లో 54 శాతం మంది ప్రీ-ఓన్డ్‌ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మెట్రో ప్రాంతాల్లో ఈ శాతం 30గా ఉంది. పెరుగుతున్న ఫోన్ ధరలు.. పెరుగుతున్న రిపేర్ భారం

వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లను గతంతో పోలిస్తే ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో కొత్త పరికరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఫోన్ ప్రమాదవశాత్తు దెబ్బతింటే రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ ఖర్చు వినియోగదారులపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతోందని అధ్యయనం పేర్కొంది.

మొత్తంగా చూస్తే, స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడటం పెరుగుతున్నా.. దాని రక్షణపై వినియోగదారుల్లో అవగాహన ఇంకా అదే స్థాయిలో పెరగలేదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఫోన్ పాడైనప్పుడు ఇంటి చిట్కాలతో తాత్కాలికంగా పరిష్కరించుకోవడం కంటే, పరికరానికి తగిన రక్షణ, వారంటీ, సురక్షితమైన రిపేర్ విధానాలపై ముందుగానే అవగాహన కలిగి ఉండటం అవసరమనే విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

Be the first to react

Latest