⚡ BREAKING
Education

NEET: రేపే నీట్ యూజీ రీ ఎగ్జామ్.. దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు ముమ్మరం!

NEET: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించేందుకు భాగంగా నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనుంది.

NEET UG
NEET UG

నీట్ పరీక్షకు భారీ ఏర్పాట్లు.. నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహణ..

22.79 లక్షల మంది అభ్యర్థులకు నీట్ రీ ఎగ్జామ్.. పటిష్ట భద్రతా చర్యలు..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించేందుకు భాగంగా నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనుంది.

నీట్ యూజీ రీ ఎగ్జామ్ రేపు జరగనుండగా, ఈ పరీక్షకు ఎన్టీఏ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

పరీక్ష నిర్వహణలో భాగంగా పరిశీలకులు, సమన్వయకర్తలు, పోలీసు సిబ్బంది, పరిపాలనా అధికారులు కలిపి రెండు లక్షలకు పైగా సిబ్బందిని నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు బహుళ స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ, పరీక్ష సామగ్రి తరలింపునకు జీపీఎస్ సదుపాయంతో కూడిన వాహనాలు, పోలీసు భద్రత వంటి ఏర్పాట్లు చేస్తున్నారు.

నీట్ యూజీ రీ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ విధానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష ప్రక్రియ కొనసాగించేందుకు ఎన్టీఏ అన్ని చర్యలు చేపట్టింది.

ఇదిలా ఉండగా, పరీక్షకు సంబంధించిన అక్రమ సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పరీక్ష మోసాలకు సంబంధించిన అక్రమ కంటెంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ చర్యలు అవసరమని కోర్టు పేర్కొంది.

Tags

Be the first to react

More Coverage