LIVE
Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  •  Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!  •  AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 85% సబ్సిడీతో ఆ పథకం పునరుద్ధరణ!  •  TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఘన విజయం!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!  •  Praja Vedika: నేడు (17/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  AP Farmers: రైతులకు డబుల్ ధమాకా.... ఒకే రోజు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల!  • 
⚡ BREAKING
Education

Modi: ‘పీఎం రోజ్‌గార్ మేళా’లో 51 వేల మందికి నియామక పత్రాలు!

Modi: దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఉపాధి అవకాశాన్ని అందించనుంది. ‘పీఎం రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎంపికైన యువతకు 51 వేలకుపైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Modi: ‘పీఎం రోజ్‌గార్ మేళా’లో 51 వేల మందికి నియామక పత్రాలు!

నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‌న్యూస్.. రేపు భారీ నియామకాలు..

ప్రధాని మోదీ చేతుల మీదుగా యువతకు ఉద్యోగ పత్రాల పంపిణీ..

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఉపాధి అవకాశాన్ని అందించనుంది. ‘పీఎం రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎంపికైన యువతకు 51 వేలకుపైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ 19వ రోజ్‌గార్ మేళా నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉద్యోగాల్లో చేరనున్నారు. ముఖ్యంగా రైల్వే శాఖ, హోంశాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యాశాఖ వంటి కీలక విభాగాల్లో నియామకాలు చేపట్టారు.

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని మోదీ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో రోజ్‌గార్ మేళా కీలక పాత్ర పోషిస్తోంది. యువతకు పారదర్శకంగా, వేగంగా ప్రభుత్వ ఉద్యోగాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది.

రోజ్‌గార్ మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన 18 మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు పంపిణీ చేశారు. దీంతో వేలాది కుటుంబాలకు ఉపాధి భరోసా లభించగా, యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యువతకు ఈ నియామకాలు కొత్త జీవితానికి నాంది పలుకుతున్నాయని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to react

More Coverage

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉక్కునగరంలో మూతపడిన 40 ఏళ్ల చారిత్రాత్మక "విశాఖ విమల విద్యాలయం"ను ఆంధ్…

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…