LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Education

Modi: ‘పీఎం రోజ్‌గార్ మేళా’లో 51 వేల మందికి నియామక పత్రాలు!

Modi: దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఉపాధి అవకాశాన్ని అందించనుంది. ‘పీఎం రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎంపికైన యువతకు 51 వేలకుపైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Modi: ‘పీఎం రోజ్‌గార్ మేళా’లో 51 వేల మందికి నియామక పత్రాలు!

నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‌న్యూస్.. రేపు భారీ నియామకాలు..

ప్రధాని మోదీ చేతుల మీదుగా యువతకు ఉద్యోగ పత్రాల పంపిణీ..

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఉపాధి అవకాశాన్ని అందించనుంది. ‘పీఎం రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎంపికైన యువతకు 51 వేలకుపైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ 19వ రోజ్‌గార్ మేళా నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉద్యోగాల్లో చేరనున్నారు. ముఖ్యంగా రైల్వే శాఖ, హోంశాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యాశాఖ వంటి కీలక విభాగాల్లో నియామకాలు చేపట్టారు.

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని మోదీ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో రోజ్‌గార్ మేళా కీలక పాత్ర పోషిస్తోంది. యువతకు పారదర్శకంగా, వేగంగా ప్రభుత్వ ఉద్యోగాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది.

రోజ్‌గార్ మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన 18 మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు పంపిణీ చేశారు. దీంతో వేలాది కుటుంబాలకు ఉపాధి భరోసా లభించగా, యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యువతకు ఈ నియామకాలు కొత్త జీవితానికి నాంది పలుకుతున్నాయని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to react

More Coverage

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉక్కునగరంలో మూతపడిన 40 ఏళ్ల చారిత్రాత్మక "విశాఖ విమల విద్యాలయం"ను ఆంధ్…

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…