LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Education

NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్!

NEET-UG: మెడికల్‌ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్-యూజీ 2026 పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

AndhraPravasi News Desk 1 min read
NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్!

నీట్ ప్రశ్నాపత్రం లీక్‌ కేసు: అరెస్టుల సంఖ్య 13కు చేరింది..

నీట్ లీక్ వ్యవహారంలో డాక్టర్‌, కోచింగ్ ఫ్యాకల్టీ అరెస్ట్..

మెడికల్‌ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్-యూజీ 2026 పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 13కు చేరింది. ఢిల్లీ, జైపూర్‌, గురుగ్రామ్‌, నాసిక్‌, పుణే, లాతూర్‌, అహల్యానగర్‌ వంటి ప్రాంతాల్లో నిందితులను గుర్తించి అరెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో తాజాగా అరెస్టైన వారిలో లాతూర్‌కు చెందిన డాక్టర్‌ మనోజ్‌ షిరురే ఒకరు. సీబీఐ వివరాల ప్రకారం, ఆయన కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఇప్పటికే అరెస్టైన పి.వి. కులకర్ణి నుంచి కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాన్ని పొందిన డాక్టర్‌ మనోజ్‌, ముగ్గురు విద్యార్థులకు ఆ ప్రశ్నలను అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో ఒకరు కోచింగ్‌ సెంటర్‌ యజమాని కుమారుడు కావడం మరింత సంచలనంగా మారింది.

మరో నిందితుడు తేజస్‌ హర్షద్‌కుమార్‌ షా. ఆయన పుణేలోని డాక్టర్‌ అభంగ్‌ ప్రభు మెడికల్‌ అకాడమీలో ఫిజిక్స్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఇప్పటికే అరెస్టైన మనీషా హవల్దార్‌ నుంచి నీట్‌ ఫిజిక్స్‌ ప్రశ్నాపత్రాన్ని ఆయన పొందినట్లు సీబీఐ తెలిపింది.

దర్యాప్తు భాగంగా దేశవ్యాప్తంగా 49 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎలక్ట్రానిక్‌ ఆధారాల ఆధారంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ నెల 3న నిర్వహించిన నీట్‌ యూజీ 2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యిందన్న ఆరోపణలు రావడంతో పరీక్షను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకావడంతో, ఈ ఘటన తీవ్ర ఆందోళనకు కారణమైంది. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నిరాశ నెలకొనగా, పారదర్శకంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Be the first to react

More Coverage

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉక్కునగరంలో మూతపడిన 40 ఏళ్ల చారిత్రాత్మక "విశాఖ విమల విద్యాలయం"ను ఆంధ్…

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…