Nara Lokesh: సియోల్లో తెలుగు డయాస్పోరాతో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీని పెట్టుబడుల హబ్గా తీర్చిదిద్దుతాం!

Nara Lokesh: దక్షిణ కొరియా సియోల్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలే ఆంధ్రప్రదేశ్కు నిజమైన “బ్రాండ్ అంబాసిడర్లు” అని పేర్కొన్నారు.

Nara Lokesh In Korea
Nara Lokesh In Korea

ప్రవాసాంధ్రులే ఏపీ బ్రాండ్ అంబాసిడర్లు – సియోల్లో మంత్రి లోకేష్..

దక్షిణ కొరియాకు భారత్లో నమ్మకమైన భాగస్వామి ఏపీ – లోకేష్ వ్యాఖ్యలు..

దక్షిణ కొరియా సియోల్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలే ఆంధ్రప్రదేశ్కు నిజమైన “బ్రాండ్ అంబాసిడర్లు” అని పేర్కొన్నారు.

విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు వ్యక్తి విజయమే రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. మీరు వ్యాపారాలు ప్రారంభించినా, మంచి పేరు సంపాదించినా ఆంధ్రప్రదేశ్ గర్వపడుతుందని చెప్పారు. మీరు వెళ్లే ప్రతి చోట రాష్ట్ర అభివృద్ధి గాథను చెప్పాలని ఆయన కోరారు.

భారత్లో దక్షిణ కొరియాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి ఆంధ్రప్రదేశ్ అని మంత్రి లోకేష్ తెలిపారు. కియా వంటి విజయగాథలు రాష్ట్రానికి ఆదర్శమని, మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలన అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ (3S) విధానంతో పాలన కొనసాగుతోందని తెలిపారు. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులకు నమ్మకమైన గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఐటీ, సెమీకండక్టర్లు, మొబిలిటీ, బ్యాటరీ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని వివరించారు.

కియా సంస్థ భారతదేశంలో తన ప్లాంట్ ఏర్పాటు చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా స్పందించి భూమి, మౌలిక సదుపాయాలు, అనుమతులు అందించిందని మంత్రి గుర్తుచేశారు. ఫలితంగా కియా ప్లాంట్ ఒక పెద్ద ఆటోమొబైల్ ఎకోసిస్టమ్గా మారి వేలాది ఉద్యోగాలు సృష్టించిందని చెప్పారు.

దక్షిణ కొరియా అభివృద్ధి ప్రయాణం ప్రపంచానికి ఆదర్శమని, స్యామ్సంగ్, హుండై, LG, కియా వంటి సంస్థలు దాని శక్తిని చూపిస్తున్నాయని లోకేష్ అన్నారు. భారత్–కొరియా సంబంధాలు వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా విశ్వాసం, ఆవిష్కరణ, యువత అభివృద్ధిపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.

యువతకు గ్లోబల్ అవకాశాలు కల్పించేందుకు విద్యా వ్యవస్థను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మారుస్తున్నామని చెప్పారు. సిలబస్ను ఆధునిక పరిశ్రమ క్లస్టర్ల ఆధారంగా రూపొందిస్తున్నామని, విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు భారతదేశ గౌరవాన్ని పెంచుతున్నారని మంత్రి అన్నారు. విదేశాల్లో ఉన్న వారికి APNRT ద్వారా సహాయం అందిస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు.

బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయని నమ్ముతున్నామని, ప్రాంతీయ అభివృద్ధి మరియు జాతీయ అభివృద్ధి కలిసి సాగాలని లోకేష్ పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాలు, ఆవిష్కరణలు సాధించడమే లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను జీవించడానికి, పనిచేయడానికి, పెట్టుబడి పెట్టడానికి అత్యుత్తమ ప్రదేశంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

Tags

Be the first to react

Latest