LIVE
Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  •  Retirement Age: పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు.. హైకోర్టు కీలక తీర్పు!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Amaravathi

Chandrababu: సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం!

Chandrababu: రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, అమరావతి నిర్మాణ ప్రాజెక్టులకు ఊతం కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.

Kasthuri S 2 min read
Chandrababu
Chandrababu

అమరావతి అభివృద్ధి.. రాష్ట్ర పెట్టుబడుల కోసం చంద్రబాబు కీలక భేటీలు..

సింగపూర్ వేదికగా ఏపీకి భారీ పెట్టుబడుల ఆకర్షణకు సీఎం ప్రయత్నం..

అమరావతి: రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, అమరావతి నిర్మాణ ప్రాజెక్టులకు ఊతం కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సీఎం బృందం కీలక సమావేశాలు నిర్వహించనుంది.

జూన్ 14వ తేదీ ఉదయం 11.35 గంటలకు బెంగళూరు నుంచి సీఎం సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. పర్యటన ప్రారంభమైన తర్వాత జూన్ 15న సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో మొదటి సమావేశం నిర్వహిస్తారు.

తొలిరోజు స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్‌తో విందు సమావేశంలో పాల్గొంటారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ ఏపీఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్, వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్‌లతో సీఎం చర్చలు జరపనున్నారు.

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోం మంత్రి కె షణ్ముగమ్, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్‌లతో కూడా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు. అలాగే సీఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించనున్నారు.

రెండో రోజు జూన్ 16న కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని సీబీఎన్@361 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం ఏపీఏసీ సెమికండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అమరావతి ప్రణాళికలకు సంబంధించి సుర్బానా జురాంగ్ సంస్థతో సమావేశం నిర్వహించనున్నారు.

తర్వాత సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో భేటీ అవుతారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో ప్రసంగించడంతో పాటు ఎగ్జిబిషన్‌ను సందర్శించనున్నారు. సింగపూర్ పెవిలియన్, ఇన్నోవేటర్ల అలయ్, గూగుల్ టెక్నాలజీస్ స్టాల్స్‌ను పరిశీలించనున్నారు.

అలాగే సీట్రియమ్ సమావేశం, సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో కూడా సీఎం పాల్గొంటారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఈడీబీ సీఈఓ షణ్మోహన్, సీఆర్డీఏ అధికారుల బృందం పాల్గొననుంది.

రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడం, రాజధాని అమరావతి అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంచడం లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. జూన్ 16వ తేదీ రాత్రి 10 గంటలకు సీఎం చంద్రబాబు స్వదేశానికి తిరిగి రానున్నారు.

Be the first to react

More Coverage

drishyam into ott where when to watch

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Ram Mohan Naidu

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…