Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ! ORR: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఆ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు... మారబోతున్న రూపు రేఖలు! AP Funds Release: ఏపీకి తీపికబురు.. రూ.281 కోట్ల నిధులు విడుదల! ఆ కష్టాలన్నీ తీరిపోయాయి... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రోజుకు రూ.50వేలు జరిమానా, ఇకపై అవి తప్పనిసరి! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ! ORR: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఆ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు... మారబోతున్న రూపు రేఖలు! AP Funds Release: ఏపీకి తీపికబురు.. రూ.281 కోట్ల నిధులు విడుదల! ఆ కష్టాలన్నీ తీరిపోయాయి... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రోజుకు రూ.50వేలు జరిమానా, ఇకపై అవి తప్పనిసరి! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు…

గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ!

2025-12-29 09:53:00
Land Resurvey: జనవరి 2 నుంచి ఆ జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే!

గుంటూరు నగరంలోని మానస సరోవరం పార్క్ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒకప్పుడు వేలాది మంది సందర్శకులతో కళకళలాడిన ఈ ఉద్యానవనం, కాలక్రమేణా నిర్లక్ష్యం కారణంగా అధ్వాన స్థితికి చేరుకుంది. ఇప్పుడు ఈ పార్క్‌ను మళ్లీ పూర్వ వైభవంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించడంతో, నగరవాసుల్లో ఆశలు పెరిగాయి.

ENari: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఈ–నారీలుగా ఛాన్స్! అర్హతలు ఇవే!

రూ.18.35 కోట్ల వ్యయంతో మానస సరోవరం పార్క్ అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సాస్కీ పథకం (2025–26) ద్వారా నిధులు సమకూర్చి, ప్రైవేట్–పబ్లిక్ భాగస్వామ్య (PPP) విధానంలో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఐదు నెలల క్రితం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పార్కును పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Train Accident: ఏపీలో ఘోర రైలు ప్రమాదం! రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం!

సుమారు 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ ఒకప్పుడు నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రోజుకు సగటున 5 వేల మంది సందర్శకులు రావడం, సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు కావడం జరిగేది. నెలకు రూ.6 లక్షల వరకు ఆదాయం కూడా వచ్చేది. అయితే కోవిడ్ సమయంలో పార్క్ మూసివేయడంతో, నిర్వహణ లోపించి పరికరాలు పాడైపోయాయి, పిచ్చిమొక్కలతో నిండిపోయి పార్క్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

Praja Vedika: నేడు (29/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇప్పుడు ఈ పార్క్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ల్యాండ్‌స్కేప్ డెవలప్‌మెంట్, మియావాకీ ప్లాంటేషన్, పర్యాటకులకు అనుకూల వసతులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. జీఎంసీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఈ పనుల కోసం అంచనాలను సిద్ధం చేసి కౌన్సిల్ ఆమోదానికి పంపింది. జీఎంసీ సాధారణ నిధుల నుంచి జంగిల్ క్లియరెన్స్ కోసం రూ.3 లక్షలు కేటాయించారు.

Mann Ki Baat: ప్రపంచానికి స్పష్టమైన హెచ్చరిక… దేశ భద్రతపై రాజీ లేదు, యువతే భారత శక్తి – మన్ కీ బాత్‌లో మోదీ ఫైర్!!

అయితే కొన్ని అభివృద్ధి అంశాలపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ల్యాండ్‌స్కేప్, మియావాకీ ప్లాంటేషన్ కోసం రూ.11 కోట్లు కేటాయించడంపై మరింత స్పష్టత అవసరమని పలువురు సూచిస్తున్నారు. అన్ని ప్రతిపాదనలను పకడ్బందీగా పరిశీలించి, గుంటూరు మిలియన్ ప్లస్ సిటీగా ఎదగడానికి ఈ పార్క్ నిజంగా ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.

Ukraine War Updates: ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన... ఆ అంశంపై ఉక్రెయిన్ గట్టి వైఖరి!!
Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం!
ATM Scam: తస్మాత్ జాగ్రత్త! ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే రావడం లేదా... ఇదొక కొత్త రకం స్కాం!
AP Cabinet: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం... కీలక అంశాలు!
Vijay Latest News: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కిందపడ్డ విజయ్…!!

Spotlight

Read More →