Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే? APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! TollPlaza: టోల్ ప్లాజాల వద్ద ఇక నో వెయిటింగ్! బారియర్లు లేని ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు! Flight Tickets: విమాన ప్రయాణికులకు డీజీసీఏ గుడ్ న్యూస్...! కొత్త నిబంధనలు ఇవే! TGSRTC Special Offer: రూ. 5130 కే గోవా టూర్.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త బంపర్ ఆఫర్! Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ! Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే? APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! TollPlaza: టోల్ ప్లాజాల వద్ద ఇక నో వెయిటింగ్! బారియర్లు లేని ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు! Flight Tickets: విమాన ప్రయాణికులకు డీజీసీఏ గుడ్ న్యూస్...! కొత్త నిబంధనలు ఇవే! TGSRTC Special Offer: రూ. 5130 కే గోవా టూర్.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త బంపర్ ఆఫర్! Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ!

APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!!

ఆంధ్రప్రదేశ్‌లో  ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రభావం ఆర్టీసీ వ్యవస్థపైనా స్పష్టంగా కనిపిస్తుంది. రెండు కొత్త జిల్లాల ఏర్పాటు, కొన్ని జిల్లాల పరిధ

Published : 2026-01-01 12:35:00
ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు!

ఆంధ్రప్రదేశ్‌లో  ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రభావం ఆర్టీసీ వ్యవస్థపైనా స్పష్టంగా కనిపిస్తుంది. రెండు కొత్త జిల్లాల ఏర్పాటు, కొన్ని జిల్లాల పరిధిలో జరిగిన మార్పులు–చేర్పుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ డిపో వ్యవస్థను కూడా కొత్త జిల్లాల వారీగా పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అధికారిక ఆదేశాలు జారీ చేయగా ఈ మార్పులు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్!

కొత్తగా ఏర్పడిన పోలవరం మార్కాపురం జిల్లాలకు అనుగుణంగా డిపోలను కేటాయించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పోలవరం జిల్లా పరిధిలో ప్రస్తుతం ఒక్క ఆర్టీసీ డిపో కూడా లేదు. ఇప్పటివరకు రంపచోడవరం బస్టాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉండగా, ఇప్పుడు అది పోలవరం జిల్లాలోకి మారింది. దీంతో ఆ బస్టాండ్ నిర్వహణ బాధ్యతలను తూర్పుగోదావరి జిల్లా గోకవరం డిపో మేనేజర్‌కు అప్పగించారు. ఇదే సమయంలో మార్కాపురం జిల్లా పరిధిలో కనిగిరి, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు డిపోలు చేరాయి.

ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు!

కొత్త జిల్లాలకు జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి పోస్టులను కూడా సృష్టించారు. పోలవరం జిల్లా కేంద్రంగా రంపచోడవరాన్ని నిర్ణయించగా, ఈ జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా డీపీటీవో వైఎస్‌ఎన్ మూర్తి బాధ్యతలు నిర్వహించనున్నారు. అలాగే మార్కాపురం జిల్లాకు ప్రకాశం జిల్లా డీపీటీవో జి. సత్యనారాయణను ఇన్‌చార్జ్‌గా నియమించారు. అవసరమైన సిబ్బంది నియామకాలు పూర్తయ్యే వరకు పొరుగు జిల్లాల అధికారులే ఈ బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

RBI Guidelines: నేటి నుంచే ఆర్‌బీఐ కొత్త రూల్స్.. ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్!

జిల్లా కేంద్రాల మార్పులతో కొన్ని డిపోల పరిపాలనా పరిధి కూడా మారింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు మారడంతో గత ఆరు నెలలుగా చిత్తూరు జిల్లా డీపీటీవోగా ఉన్న రాము అన్నమయ్య జిల్లా డీపీటీవోగా కొనసాగుతూ, మదనపల్లె కేంద్రంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మార్పుల వల్ల రవాణా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు!

డిపోల సంఖ్య పరంగా చూస్తే, పోలవరం జిల్లా రాష్ట్రంలోనే డిపో లేని ఏకైక జిల్లాగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఒక్క డిపో మాత్రమే ఉంది. విజయనగరం జిల్లాలో విజయనగరం, ఎస్.కోట డిపోలు ఉండగా, అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం డిపోలు ఉన్నాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 10 డిపోలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కడప, నంద్యాల, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఏడేసి డిపోలు ఉన్నాయి.

Postal: 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగం..! పరీక్ష లేకుండానే ఎంపిక!

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మొత్తం తొమ్మిది డిపోలు ఒక జిల్లా నుంచి మరో జిల్లా పరిధిలోకి మారాయి. కందుకూరు, అద్దంకి డిపోలు ప్రకాశం జిల్లాలోకి చేరగా, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, పొదిలి డిపోలు మార్కాపురం జిల్లాకు వెళ్లాయి. అలాగే గూడూరు డిపో తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాకు, పుంగనూరు చిత్తూరు నుంచి అన్నమయ్య జిల్లాకు, రాజంపేట అన్నమయ్య నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు బదిలీ అయ్యాయి.

Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి!

 కొత్త జిల్లాల పాలన కోసం ఉన్నతాధికారుల నియామకాలు కూడా పూర్తయ్యాయి. పోలవరం జిల్లాకు ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా ఎస్. దినేష్ కుమార్‌ను, ఇన్‌చార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్‌ను నియమించారు. అలాగే తిరుమాని శ్రీ పూజను ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన ప్రారంభమవుతుందని, ప్రజలకు సేవలు మరింత చేరువ కావాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు!
H-1B వీసాపై ట్రంప్ షాక్! లక్ష డాలర్ల ఫీజుకు కోర్టు గ్రీన్ సిగ్నల్!
Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు..

Spotlight

Read More →