⚡ BREAKING
Thalliki Vandanam: ‘తల్లికి వందనం’ కొత్త రూల్స్ ఇవే! ఆ 6 కండిషన్స్ ఉంటేనే - ఈ నెల 22నే.. ఎవరెవరు అర్హులో తెలుసుకోండి!  •  Gorantla Butchaiah: అంత్యక్రియల వేళ ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఆంబోతులా రంకెలు! కన్నబిడ్డను తండ్రి చివరి చూపుకు దూరం!  •  first hydrogen train: పర్యాటకులకు గుడ్ న్యూస్.. 8 చారిత్రక రూట్ల రూపురేఖలు మార్చనున్న రైల్వే! రేపే భారత రైల్వే హిస్టరీలో..  • 

praja vedika: వైసీపీ రౌడీ మూకల దౌర్జన్యం.. రూ. 2 కోట్లు ఇస్తారా.. ఐదెకరాల భూమి రాసిస్తారా? అంటూ బెదిరింపులు! గ్రీవెన్స్ లో ఫిర్యాదు..

praja vedika: కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సరోజమ్మ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. గతంలో ఆదోని మున్సిపాలిటీలో టీడీపీ తరఫున కౌన్సిలర్‌గా పనిచేశాం.

వైసీపీ రౌడీ మూకల దౌర్జన్యం.. రూ. 2 కోట్లు ఇస్తారా..
వైసీపీ రౌడీ మూకల దౌర్జన్యం.. రూ. 2 కోట్లు ఇస్తారా..
  • ఉద్యోగాల పేరిట రూ. 20.50 లక్షల దగా చేసిన వైసీపీ నేత భవనం ఈశ్వర్ రెడ్డిపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు..

  • Politics: గిరిజనుడి స్థలంపై వైసీపీ మహిళా నాయకురాలి కన్ను.. న్యాయం చేయాలంటూ వినతి..

praja vedika: కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సరోజమ్మ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. గతంలో ఆదోని మున్సిపాలిటీలో టీడీపీ తరఫున కౌన్సిలర్‌గా పనిచేశాం. గత మూడు సంవత్సరాల క్రితం తన ఆంజనేయులుకు గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వైసీపీ నాయకుడు భవనం ఈశ్వర్ రెడ్డి (మై డ్రీమ్ హోమ్ అపార్ట్మెంట్స్) తో పరిచయం ఏర్పడింది. 2024లో సర్వ శిక్ష అభియాన్ ద్వారా టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన సమయంలో.. తనకు ఉన్నతాధికారులు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసని భవనం ఈశ్వర్ రెడ్డి నమ్మబలికారు. 

తన భర్త ద్వారా సుమారు 12 మంది నిరుద్యోగుల నుండి ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేశారు. ఈశ్వర్ రెడ్డి వ్యక్తిగత మొబైల్ నెంబర్ (9693779999) కు ఫోన్ పే ద్వారా, అలాగే ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ (20355855691) కు విడతల వారీగా రూ.12,50,000 బదిలీ చేశాం. అంతేకాకుండా, ఈశ్వర్ రెడ్డి ఆదోని వచ్చినప్పుడు స్థానిక గెస్ట్ హౌస్‌లో తన సమక్షంలోనే నేరుగా మరో రూ.8,00,000 నగదును తీసుకున్నారు. ఇలా మొత్తంగా రూ. 20,50,000 వసూలు చేసి మోసగించారు. SSA టీచింగ్ ఉద్యోగాల కోసం బోయ కామాక్షమ్మ (రూ.2 లక్షలు), విసి శ్రావణి (రూ.2 లక్షలు), బళ్లారి వైష్ణవి (రూ.2 లక్షలు). SSA నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం గుమ్మల సుజాత (రూ.1 లక్ష), షహీనా బేగం (రూ.1 లక్ష), కరూర్ జానమ్మ (రూ.1 లక్ష), వడ్డే జయలక్ష్మి (రూ.50 వేలు), కృష్ణ (రూ.1 లక్ష). డిగ్రీ కాలేజీ అకౌంటెంట్ ఉద్యోగాల కోసం బోయ రూప (రూ.1 లక్ష), బోయ మీనా (రూ.1 లక్ష).

డబ్బులు తీసుకున్నప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం, అటు బాధితుల నుండి ఒత్తిడి పెరగడంతో ఆంజనేయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైసీపీ నాయకుడు భవనం ఈశ్వర్ రెడ్డి చేసిన మోసం, నమ్మకద్రోహం కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆంజనేయులుకు బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) వచ్చి అకాల మరణం చెందారు. తన భర్త మరణానికి భవనం ఈశ్వర్ రెడ్డే కారణమని, ప్రస్తుతం ఇద్దరు కుమారులతో తాను ఒంటరిగా మిగిలానని  కన్నీటిపర్యంతమయ్యారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, ఏపీ మాదిగ సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ చైర్‌పర్సన్ డా. ఉండవల్లి శ్రీదేవిలకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన డి. భాస్కర్ నాయక్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..2010వ సంవత్సరంలో నల్లచెరువు గ్రామంలోని సర్వే నంబర్ 133-410, 133-429 లలో ముంతాజ్ బేగం అనే మహిళ వద్ద 125 చదరపు గజాల నివాస స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. నాటి నుండి ఆ స్థలం తన ఆధీనంలోనే ఉంది. అయితే, స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వైసీపీ మహిళా నాయకురాలు ఎన్. మోదీనమ్మ తన స్థలంపై కన్ను వేశారు. తాను గిరిజన సామాజిక వర్గానికి చెందినవాడు, వెనుకబడినవాడు కావడంతో ఎలాంటి అండ లేదని భావించి, మోదీనమ్మ తన అనుచరులతో కలిసి ఆ 125 చదరపు గజాల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారు. స్థలం గురించి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం, తిరుమలాపురం గ్రామానికి చెందిన డా. మౌష్మి యాగంటి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన తండ్రి సుబ్రహ్మణ్యం గారి మరణానంతరం కుటుంబంలో నలుగురు మహిళలే ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వైసీపీ నాయకులు వ్యక్తిగత కక్షలతో వేధింపులకు దిగారు. తన వ్యవసాయ భూముల్లోకి అక్రమంగా చొరబడి, మోటార్ గేట్ వాల్ ను పగలగొట్టి ధ్వంసం చేశారు. పొలాల్లో పనులకు వచ్చే రైతులను, కూలీలను కూడా భయభ్రాంతులకు గురిచేస్తూ, ఎవరూ పొలంలోకి అడుగుపెట్టవద్దని దౌర్జన్యం చేస్తున్నారు. దీనివల్ల తన కుటుంబానికి ఆర్థికంగా, మానసికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

ఇటీవల కాలంలో ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. గతంలో ఆ ప్రాంతంలో జరిగిన ఓ సీనియర్ టీడీపీ కార్యకర్త హత్యను ఉదాహరిస్తూ.. "మా సత్తా ఏంటో చూశావుగా.. మిమ్మల్ని లేపేయడం మాకు పెద్ద విషయం కాదు. ప్రాణాలు దక్కించుకోవాలంటే రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి, లేదా మీకున్న ఐదు ఎకరాల భూమిని మాకు అప్పగించాలి" అంటూ సదరు రౌడీ మూకలు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాణహాని, దౌర్జన్యాలపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసుల నుండి ఎలాంటి రక్షణ కానీ, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు కానీ తీసుకోలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళకు చెందిన నరసమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..సర్వే నంబర్ 960 లో తమకి రూ. 2.70 సెంట్ల భూమి ఉండేది. అందులో తమ మామగారైన మొక్కరాల హనుమయ్య 1969లో 1.50 సెంట్లు, 1992లో మరో 1.00 ఎకరాన్ని విక్రయించారు. మిగిలిన 0-20 సెంట్ల భూమిని తన కోడలైన తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. నాటి నుండి ఈ భూమి తన ఆధీనంలోనే ఉంటూ వస్తోంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, అడంగల్, 1బి కాపీలు, సర్వే సర్టిఫికెట్లు అన్నీ పక్కాగా ఉన్నాయి. అయితే ఈ భూమికి పక్కనే హద్దుదారుగా ఉన్న వైసీపీ నాయకుడు, మాజీ సమాచార హక్కు చట్టం కమిషనర్ రేపాల శ్రీనివాసరావు గత ప్రభుత్వ హయాంలో తన రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించారు.

అప్పటి పిడుగురాళ్ళ తహశీల్దారు చక్రవర్తి సహాయంతో, ఆ 20 సెంట్ల భూమిని తానే కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలతో ఆన్‌లైన్‌లో తన పేరు మీదకు మార్పించుకున్నారు. తన భూమిని తనకు ఇచ్చేయాలని కోరగా, రేపాల శ్రీనివాసరావు తన పలుకుబడితో తనపైనే తప్పుడు కేసులు బనాయించారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యులపై బైండోవర్ కేసులు నమోదు చేయించి, మూడు సార్లు పోలీస్ స్టేషన్‌లో ఉంచి తీవ్రంగా వేధించారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం బూరుగులపల్లి గ్రామానికి చెందిన యశోదమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..గత కొంతకాలంగా తనకు చెందిన 50 సెంట్ల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అయితే, స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ భూమిపై కన్ను వేశారు. తనకు తెలియకుండానే తప్పుడు సంతకాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఒక అగ్రిమెంట్ బాండ్ సృష్టించారు. అందులో తాము రూ. 30 లక్షలు ఇచ్చినట్లు, సేల్ అగ్రిమెంట్‌లో మరో రూ. 50 లక్షలు రాసుకుని.. "డబ్బులైనా కట్టండి లేదా భూమినైనా వదిలేసి వెళ్ళిపోండి" అంటూ తనపై, తన పిల్లలపై నిరంతరం దౌర్జన్యానికి దిగుతున్నారు. ఈ అక్రమ కబ్జా ప్రయత్నంపై గుడుపల్లి పోలీస్ స్టేషన్‌లో సీఐ గారికి ఫిర్యాదు చేశాను. అయితే పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోకుండా "కూర్చుని మాట్లాడుకోండి" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

తాము అసలు భూమిని అమ్మనే లేదని, దానికి సంబంధించిన ఎలాంటి వేలిముద్రలు, సంతకాలు పెట్టలేదని మొరపెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదు. స్థానిక సి.ఐ, ఎస్.ఐ గార్లు కబ్జాదారులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అటు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లగా కోర్టుకు వెళ్లమని చెప్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు రోజురోజుకూ రెచ్చిపోతూ, తమపై మరింత దౌర్జన్యం చేస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. 

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పేరంటాలపాలెం గ్రామానికి చెందిన అచ్చియ్యమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..రేగుపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 245 లో తనకు 0.58 సెంట్ల భూమి ఉంది. అయితే, గతంలో నిర్వహించిన రీసర్వే సమయంలో రికార్డుల్లో తీవ్ర వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. ఖాతా నెంబర్ 170 కింద, LP నెంబర్లలో వచ్చిన తేడాల వల్ల 0.58 సెంట్ల భూమికి గాను ప్రస్తుతం కేవలం 0.26 సెంట్లు మాత్రమే రికార్డుల్లో నమోదైంది. మిగిలిన 0.32 సెంట్ల భూమి రికార్డుల్లో మాయమైంది. ఈ రికార్డుల తప్పుల వల్ల తన భూమిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయి గ్రామాని చెందిన కొంగర వెంకటేశ్వర్లు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామ శివారులోని సర్వే నెంబర్లు 356-1, 356-2 లలో తనకు 2.18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆర్.ఎస్.ఆర్, 1-బి, అడంగల్ రికార్డులన్నింటిలోనూ 2.18 ఎకరాలుగానే స్పష్టంగా నమోదై ఉంది. అయితే, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఆ భూమిని కొలిచి చూస్తే కేవలం 1.90 ఎకరాలు మాత్రమే ఉంది. అంటే దాదాపు 0.28 సెంట్ల భూమి తక్కువగా చూపిస్తోంది. ఈ సమస్యపై గత 10 సంవత్సరాలుగా మండల తహశీల్దార్, ఆర్.డి.ఓ, జిల్లా కలెక్టరు గారికి అనేక పర్యాయములు దరఖాస్తులు చేసుకున్నాను. అయినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ఏలూరు జిల్లా మండవల్లి మండలం భైరవపట్నం గ్రామానికి చెందిన గొల్లేరు లక్ష్మి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన భర్త, పిల్లలతో కలిసి నివాసం ఉండటానికి ఒక ఇంటిని నిర్మించుకున్నాను. అయితే, తమ బంధువులైన నున్న వెంకటేశ్వరరావు, ఆయన మేనమామ, అన్నయ్య, బావమరిది కలిసి విచక్షణారహితంగా ప్రవర్తించారు. తన ఇంటి తాళాలు బద్దలు కొట్టి, లోపలికి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న తనని, తన పిల్లలను బలవంతంగా బయటకు గెంటివేసి, ఇళ్లను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. 

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం గరికపాడు గ్రామానికి చెందిన తోట పద్మజ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ తాతగారైన తోట సుదర్శన్ రావు గారు 1966లో తన ముగ్గురు కుమారులకు గ్రామ పరిధిలో 7 ఎకరాల 59 సెంట్ల భూమిని విక్రయించి సర్వే నెంబర్లు 142, 148-1 ఇచ్చారు. నాటి నుండి ఈ భూమి తమ ఆధీనంలోనే ఉంది. అయితే, ఈ భూమిని తాము కానీ, తమ తండ్రి, ఇతర హక్కుదారులు కానీ ఎవరికీ విక్రయించలేదు. ఈ విషయం పొరుగు గ్రామమైన ఉయ్యందన గ్రామస్థులకు కూడా బాగా తెలుసు.

కానీ గుడిపాడు గ్రామ సర్పంచ్ షేక్ జానీషా వెనుక ఉండి నడిపిస్తూ, సదరు 7 ఎకరాల 59 సెంట్ల భూమిని అక్రమంగా కబ్జా చేయించారు. అంతేకాకుండా, ఆ భూమిపై పలు రకాల నకిలీ రిజిస్ట్రేషన్లు సృష్టిస్తూ, అసలు హక్కుదారులైన తమని సాగు చేసుకోకుండా పొలంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయమై ఎదురు తిరిగితే తీవ్ర పరిణామాల ఉంటాయని సర్పంచ్ వర్గీయులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కొన్నేళ్లుగా తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి అక్రమాలను అడ్డుకోలేకపోతున్నాం. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

అనంతపురం జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన బి. కవిత గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తనకు 12-13 సంవత్సరాల మైనర్ వయసులోనే బళ్లారిలోని మేనత్త ఇంటికి ఇచ్చి బాల్యవివాహం చేశారు. అయితే, అత్తగారి ఇంటి వేధింపులు తట్టుకోలేక, మేజర్ అయిన తర్వాత చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాను. అనంతరం తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుని ప్రస్తుతం గర్భవతిగా ఉన్నాను. తన తండ్రి నుండి సంక్రమించిన 10 ఎకరాల భూమిని అన్నదమ్ములకే ఇచ్చేశారు. అయితే తన తల్లి నుండి సంక్రమించిన 2 ఎకరాల భూమిని గతంలో పెద్దల సమక్షంలో తనకు 'పసుపు కుంకుమ' కింద అగ్రిమెంట్ చేసి ఇచ్చారు. ప్రస్తుతం ఈ 2 ఎకరాల భూమే తమకు, తమ పిల్లలకు ఏకైక జీవనాధారం. ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటుండగా, ఈ 2 ఎకరాల భూమిపై తన అన్న, వదిన వారి బంధువుల కన్ను పడింది.

గడిచిన మూడు నెలలుగా వారు తనను తీవ్ర మానసిక, శారీరక చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆ భూమిని వారి పేరిట రాయించుకోవడానికి కిడ్నాప్ చేయాలని, నిరాకరిస్తే చంపేస్తామని బెదిరిస్తూ హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ వేధింపులపై గతంలో అనంతపురం జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయగా, ఆయన సదరు నిందితులకు పలుమార్లు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ, పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయకుండా వారు తనపై నిరంతరం దాడులకు తెగబడుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

కాకినాడ జిల్లా కాజులూరు మండలం పాతమంజేరు గ్రామానికి చెందిన సూర్యనారాయణ మూర్తి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి.. తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 207 లో శ్మశాన వాటిక కొరకు రికార్డుల ప్రకారం 3.40 ఎకరాల భూమి ఉంది. అయితే, ఈ భూమిపై కన్నేసిన కొందరు స్థానిక వ్యక్తులు రికార్డులను తారుమారు చేసి, అత్యధిక భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కేవలం 60 సెంట్ల భూమి మాత్రమే మిగిలి ఉంది.

మిగిలిన భూమినంతా కబ్జాదారులు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే కాకుండా, అంత్యక్రియల నిమిత్తం అక్కడికి వెళ్లే గ్రామ ప్రజలను, పార్థివ దేహాల వాహనాలను రాకుండా అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ శ్మశాన భూమి వివాదంపై గతంలో కోర్టు కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఆదేశాలను అమలు చేయలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని పూర్తి శ్మశాన భూమిని సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలని, కబ్జాదారుల నుండి భూమిని విడిపించి చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని కోరాడు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన రావి అనిత గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. 2019లో తన స్నేహితురాలు అనురాధ దగ్గర నమ్మకంతో ఒక స్థలాన్ని కొనుగోలు చేశాను. అయితే, రెండేళ్ల క్రితం (2024లో) ఆ స్థలాన్ని అమ్ముదామని భావించి అక్కడికి వెళ్లగా.. అప్పటికే ఆ స్థలంలో వేరే ఎవరో ఇల్లు నిర్మించి ఉండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. దీనిపై విచారించగా, ఆ స్థలాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని, తనను మోసం చేసి వేరే వాళ్లకు కూడా దాన్ని కట్టబెట్టారని తెలిసింది.

ఈ మోసంపై తన స్నేహితురాలు అనురాధను నిలదీయగా, ఆమె సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తూ తప్పించుకు తిరుగుతోంది. దీంతో న్యాయం కోసం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాను. దాదాపు ఏడాదిన్నర పాటు స్టేషన్ చుట్టూ తిరిగిన తర్వాత ఆరు నెలల క్రితం పోలీసులు ఎఫ్‌ఐఆర్ అయితే నమోదు చేశారు కానీ, ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేసును పూర్తిగా పక్కన పెట్టేసారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Tags

Be the first to react

Latest