LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

Minister Savita: బీసీలను అభివృద్ధి చేసిందీ మేమే.. ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు - మంత్రి సవిత

Minister Savita Developed the BCs: ‘అయిదేళ్లలో వెనుకబడిన తరగతులకు జగన్ చేసింది శూన్యం, బీసీలకు పునాదులు మేమే... వారిని అభివృద్ది చేసింది కూడా మేమే..’అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్…

AndhraPravasi News Desk 2 min read
Minister Savita: బీసీలను అభివృద్ధి చేసిందీ మేమే.. ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు - మంత్రి సవిత
  • రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి సవిత..
     
  • 2.0 పథకాలను ప్రారంభించిన ఘనత సీఎం..

Minister Savita Developed the BCs: ‘అయిదేళ్లలో వెనుకబడిన తరగతులకు జగన్ చేసింది శూన్యం, బీసీలకు పునాదులు మేమే... వారిని అభివృద్ది చేసింది కూడా మేమే..’అని  రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తర సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. 2014-19లో వడ్డెర్లకు, రజకులకు, మత్స్యకారులతో ఇతక బీసీ కులాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వంలోనూ బీసీలకు పెద్దపీట వేస్తున్నామని, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు.

గతంలో ఆదరణ, ఆదరణ 2.0 పథకాలను ప్రారంభించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. త్వరలో ప్రారంభించబోయే ఆదరణ 3.0లో వడ్డెర్లకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. వడ్డెర్లకు మైనింగ్ లీజు కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్లు, సీనరేజీలో 50 శాతం మినహాయింపు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని, వాటికి సంబంధించిన ఫైళ్లు ఆర్జిక శాఖ వద్ద ఉన్నాయని తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధం కాలంలో మత్స్యకారులకు(పల్లెకారులు) ఇచ్చే ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇలా రాష్ట్రంలో ఉన్న 1.20 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు.  మత్స్య కారులు చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల వరకూ బీమా చెల్లిస్తున్నామన్నారు. మత్స్యకారుల మర పడవులకు వినియోగించే లీటర్ డీజిల్ పై రూ.9లు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మత్స్య కారుల పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నామన్నారు. మత్స్య కారుల పడవలు మరమ్మతులకు రూ.30 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.

ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు
దేశంలో మొట్టమొదటిసారిగా 2014-19 మధ్య రజకల ఆర్థిక వృద్ధి కోసం ధోబి ఘాట్లు నిర్మించిన ఘనత సీఎం చంద్రబాబుదేని మంత్రి సవిత తెలిపారు. రాబోయే ఆదరణ 3.0 పథకంలోనూ రజకులకు వాషింగ్ మిషన్లు, ఆధునిక పరికరాలు అందజేయబోతున్నామన్నారు. వడ్డెర్లను, మత్స్యకారులను, రజకులను, వాల్మీకీలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలిస్తున్నామని, ఆయా కమిటీల నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జాబితాలో కొత్త కులాలను చేర్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, ఈ విషయం సభ్యులకు కూడా తెలుసని మంత్రి సవిత తెలిపారు.

బీసీలకు జగన్ చేసింది శూన్యం
వైసీపీ ప్రభుత్వ హయాంలో అయిదేళ్ల పాటు బీసీలకు జగన్ చేసిందేమీ లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. 2014-19 మధ్య ఆయా కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాల్లో చేర్చడానికి అధ్యయన కమిటీలను అప్పట్లో తమ ప్రభుత్వమే నియమించిందన్నారు. తరవాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆయా కమిటీలను  నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వడ్డెర్లతో పాటు అన్ని బీసీ కులాలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దనున్నామన్నారు. బీసీలకు పునాదులు, వాళ్లకు అభివృద్ధి చేసిందీ తామేనని మంత్రి సవిత స్పష్టంచేశారు. 

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…