LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

Savita Fire On YCP: ఆనాడే ఇదే విషయమై వైసీపీ శ్రేణులు నిలదీయాల్సింది.. మంత్రి సవిత ఫైర్!

Savita Fire On YCP: ‘కమిషన్ల పేరుతో దోచుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జగన్ తెర తీశాడు... ఎన్జీటీ అడ్డుకోవడంతో ఆ కుట్ర విఫలమైంది... 2020 అక్టోబర్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపేయాలంటూ ఎన్జీటీ స్టే ఇస్తే, ఆ తరవాత మూడేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఆ ప్రాజెక్టు గురి…

AndhraPravasi News Desk 3 min read
Savita Fire On YCP: ఆనాడే ఇదే విషయమై వైసీపీ శ్రేణులు నిలదీయాల్సింది.. మంత్రి సవిత ఫైర్!
  • రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోవడానికి ప్రధాన కారణం జగనే..
     
  • అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు రమ్మంటున్నాజగన్ బ్యాచ్ రావడం లేదు..

Savita Fire On YCP: ‘కమిషన్ల పేరుతో దోచుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జగన్ తెర తీశాడు... ఎన్జీటీ అడ్డుకోవడంతో ఆ కుట్ర విఫలమైంది... 2020 అక్టోబర్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపేయాలంటూ ఎన్జీటీ స్టే ఇస్తే, ఆ తరవాత మూడేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోలేదు.... ఇదే విషయమై ఆనాడే జగన్  ను వైసీపీ శ్రేణులు నిలదీసి ఉంటే... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయ్యి ఉండేది..’ అని  రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు  జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్  నిలిచిపోవడానికి ముమ్మాటికీ జగనే కారణమని,  రౌండ్ టేబుళ్ల సమావేశాలంటూ ఇప్పుడు వైసీపీ శ్రేణులు చేస్తున్నదంతా డ్రామాలేనని విమర్శించారు.

రాయలసీమను అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండేలా సీఎంచంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. వారి రౌండ్ టేబుళ్ల సమావేశాల డ్రామాలు ప్రజలు గుర్తించారని, వైసీపీ కుట్రలను  పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అన్నారు. కమిషన్ల కక్కుర్తి కోసం ఎటువంటి అనుమతులు లేకున్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తన హయాంలో జగన్ ప్రారంభానికి సిద్దమయ్యారన్నారు. 

తెలంగాణాలో అధికారంలో ఉన్న ఆనాటి బీఆర్ఎస్ నాయకులు ఎన్జీటీకి వెళ్లడంతో, ఎత్తిపోతల పథకానికి కోర్టు అడ్డు చెబుతూ, ప్రాజెక్టు పనులు నిలిపేయాలని 2020న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎక్కడవక్కడ నిలిచిపోయాయన్నారు. కోర్టు ఉత్తర్వుల తరవాత జగన్... రాష్ట్రంలో మరో మూడేళ్లు అధికారంలో ఉన్నారన్నారు. కనీసం ఆయన  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మంత్రి సవిత విమర్శించారు.

ఆనాడే జగన్ ను నిలదీసి ఉండాల్సింది…
జగన్ అవినీతి, అసమర్థ నిర్ణయాల వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇదే విషయమై ఆనాడే జగన్ ను రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు నిలదీయాల్సి ఉండాల్సిందన్నారు. జగన్ తీరుతో రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు పట్టించుకోవడం మానేసి, ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. వైసీపీ నాయకుల చేష్టలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని మంత్రి సవిత తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం రాయలసీమకు తాగు, సాగునీరందించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. వైసీపీ నాయకుల పొలాలకు నీరు వస్తుందంటే అది కూడా సీఎం చంద్రబాబు చలవేనని మంత్రి సవిత స్పష్టంచేశారు.

సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి…
రాయలసీమను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 2014-19 మధ్య రాయలసీమ తాగు, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.12,441 కోట్లు వెచ్చించారని మంత్రి సవిత గుర్తు చేశారు. తరవాత వచ్చిన జగన్ ... అయిదేళ్లలో కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, రాయలసీమ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రూ.3,870 కోట్లతో హంద్రీ-నీవా కాలువను అభివృద్ధి కుప్పం వరకూ సాగు నీరందించామన్నారు. రాయలసీమను హార్టీకల్చర్, పారిశ్రామిక, పర్యాటక హబ్ గా అభివృద్ది చేస్తున్నామన్నారు. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధిక శాతం ఏపీకే తరలొస్తున్నాయన్నారు. ఇందుకు కారణం సీఎం చంద్రబాబు విజనేనని మంత్రి సవిత కొనియాడారు.

చర్చకు భయపడి పారిపోతున్న వైసీపీ
ప్రజా సమస్యలపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా జగన్ గాని, ఆయన పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని మంత్రి సవిత మండిపడ్డారు. వైసీపీ అయిదేళ్ల కాలంలో జరగని అభివృద్ధి కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అసెంబ్లీకి రావాలని, పద్ధతిగా మీకు రావాల్సిన సమయం కేటాయిస్తామని చెప్పినా వైసీపీ నేతలు శాసనసభకు రావటంలేదన్నారు. శాసనమండలికి వస్తున్నా సభ జరగనీయకుండా, క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా, భయపడి సభ నుంచి పారిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి మండిపడ్డారు. 2026-27 నూతన బడ్జెట్ లో బీసీలకు అధిక ప్రాధాన్యం కలిగించేలా కేటాయింపులు చేశారన్నారు. తమది బీసీల పక్షపాతి ప్రభుత్వమని మంత్రి సవిత స్పష్టం చేశారు. 

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…