LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

Free cycles distribution: పిల్లల చదువు భారం కాకూడదు - సైకిళ్ల పంపిణీలో మంత్రి గొట్టిపాటి భావోద్వేగ ప్రసంగం..!!

అద్దంకి నియోజకవర్గంలో 8 వేల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. దాతల సహకారంతో త్వరలోనే పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి భరోసా

AndhraPravasi News Desk 2 min read
Free cycles distribution: పిల్లల చదువు భారం కాకూడదు - సైకిళ్ల పంపిణీలో మంత్రి గొట్టిపాటి భావోద్వేగ ప్రసంగం..!!

మంచి పనులకు దాతల అండ

త్వరలో పాఠశాలల్లో తాగునీటి ప్లాంట్లు

విద్యలో రాజకీయాలకు తావులేదు

పేద విద్యార్థుల చదువుకు రవాణా కష్టాలు సమస్య కాకూడదనే సంకల్పంతో అద్దంకి నియోజకవర్గంలో చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఒక మహా యజ్ఞంలా కొనసాగుతోంది. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 8 వేల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందించినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. బల్లికురువ మండలం వేమవరం ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మరో 44 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు తోడుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కేవలం స్కూల్ విద్యార్థులకే కాకుండా ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే పేద విద్యార్థులకు కూడా వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ 8 వేల సైకిళ్లలో వెయ్యి సైకిళ్లను తమ సొంత కంపెనీ ద్వారా అందించడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. మనం చేసే పని మంచిదైతే సమాజం నుంచి దాతలు తప్పకుండా సహకరిస్తారు అని చెప్పడానికి ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమమే నిదర్శనమని మంత్రి అన్నారు.

విద్యార్థుల కోసం తాము పడుతున్న తపన చూసి ఒక దాత స్పందించి, పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు రూ.12 లక్షల విరాళం ఇచ్చారని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. ఈ నిధులతో త్వరలోనే నియోజకవర్గంలోని 8 పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

గత ప్రభుత్వ పాలనలో పేద విద్యార్థుల పట్ల జరిగిన వివక్షను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఒకసారి అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఒక తండ్రి తన వద్దకు వచ్చి.. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులు వేస్తున్నారు, రెండో వాడిని కూలికి పంపాలా? అని అడిగిన ప్రశ్న తనను కలచివేసిందని మంత్రి అన్నారు. ఈ విషయాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన సానుకూలంగా స్పందించి 'తల్లికి వందనం' పథకాన్ని అందరికీ వర్తింపజేస్తున్నారని తెలిపారు.

లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి కొనియాడారు. విద్యార్థులకు ఇచ్చే బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాంల విషయంలో ఎక్కడా రాజకీయ రంగులు ఉండకూడదని, సకాలంలో నాణ్యమైన వస్తువులను అందిస్తున్నామని చెప్పారు. సైకిళ్ల పంపిణీ విషయంలోనూ తాను ఎటువంటి రాజకీయ రంగులు వేయవద్దని ఆదేశించానని, పిల్లలు చదువుకుంటే వాటంతట అవే అర్థమవుతాయని గొట్టిపాటి పేర్కొన్నారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు విద్యార్థులకు అనుమతి ఇవ్వడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…