LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

Atchannaidu: హిందూవుల మనోభావాలు జగన్ కు పట్టవా? శాసన మండలిలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్!

Atchannaidu Comments On Jagan: శాసన మండలిలో అధికార పక్షం సభ్యులు సాక్ష్యాధారాలతో సహా ప్రతిపక్షాన్ని తిప్పికొట్టడంతో వైసీపీ సభ్యులు ఆత్మరక్షణలో పడ్డారు. కల్తీ నెయ్యి అంశంపై ఇన్ని రోజులు వైసీపీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాన్ని సభలో ఒకవైపు మంత్రి అచ్చెన్నాయుడు, మరో వైపు మంత్రి పయ్…

AndhraPravasi News Desk 1 min read
Atchannaidu: హిందూవుల మనోభావాలు జగన్ కు పట్టవా? శాసన మండలిలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్!
  • మండలిలో కల్తీ నెయ్యిపై చర్చను అడ్డుకున్న వైసీపీ సభ్యులు..
     
  • క్రైస్తవుల పట్ల ఒకలా, హిందూవులపై మరోలా జగన్ తీరు..

Atchannaidu Comments On Jagan: శాసన మండలిలో అధికార పక్షం సభ్యులు సాక్ష్యాధారాలతో సహా ప్రతిపక్షాన్ని తిప్పికొట్టడంతో వైసీపీ సభ్యులు ఆత్మరక్షణలో పడ్డారు. కల్తీ నెయ్యి అంశంపై ఇన్ని రోజులు వైసీపీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాన్ని సభలో ఒకవైపు మంత్రి అచ్చెన్నాయుడు, మరో వైపు మంత్రి పయ్యావుల కేశవ్ ధీటైన సమాధానం ఇచ్చారు. కల్తీ నెయ్యిపై ఇన్ని రోజులు వైసీపీ నేతలు చేసిన తప్పుడు ప్రచారం మండలిలో జరిగిన చర్చ ద్వారా మరోసారి బయటపడింది. వైసీపీ డొల్లతనం బట్టబయలైంది. ఏం మాట్లాడాలో తెలియక వైసీపీ సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే... ఒక దశలో శాసనమండలి ఛైర్మన్ కూడా వైసీపీ తీరును తప్పుబట్టి ఆగ్రహం వ్యక్తం చేయక తప్పనిసరైంది. 

జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టే దేవాలయాల ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేకపోయారు. గత ఐదేళ్లల్లో ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించకపోవడం ఒక్కసారి కూడా కుటుంబంతో దర్శనానికి వెళ్లకపోవడం, డిక్లరేషన్ పై సంతకం చేయకపోవడం వంటి అంశాలు జగన్ మనస్తత్వాన్ని బయటపెడుతున్నాయని అచ్చెన్నాయుడు సభలో జగన తీరును ఎండగట్టారు. అదే విధంగా గతంలో సాక్షిలో ప్రచురితమైన వార్తను మంత్రి అచ్చెన్నాయుడు సభ దృష్టికి తీసుకొచ్చారు. 

జీసెస్ ఫోటో సాక్షిలో తప్పుగా ప్రచురించినందుకు క్రైస్తవ సోదరులకు శతకోటి క్షమాపణలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, తాను చేసిన పాపాలకు హిందువులకు క్షమాపణ చెప్పకపోగా... హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని ప్రతి రోజూ మండలిలో పట్టుబట్టిన వైసీపీ సభ్యులు... నేడు అదే అంశంపై నిర్వహించిన చర్చలో కల్తీ నెయ్యి విషయం తప్ప మిగతా అంశాలను ప్రస్తావిస్తూ నవ్వులపాలయ్యారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. మండలిలో వైసీపీని డిఫెన్సులోకి నెట్టేయడంలో టీడీపీ సీనియర్లు అచ్చెన్నాయుడు, పయ్యావుల సక్సెస్ అయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…