LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

Kolusu Parthasarathy: టీచర్లకు 15 రోజులు వేసవి సెలవులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం! ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా..

Kolusu Parthasarathy: మహిళా శిశు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి చెప్పారు.

AndhraPravasi News Desk 2 min read
Kolusu Parthasarathy: టీచర్లకు 15 రోజులు వేసవి సెలవులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం! ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా..
  • 5వేల మినీ అంగన్వాడీ సెంటర్లను పూర్తి స్థాయి అంగన్వాడీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసిన కూటమి ప్రభుత్వం..
     
  • కూటమి ప్రభుత్వంలో కొట్టాది రూపాయలతో అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సౌకర్యలు..

Kolusu Parthasarathy: మహిళా శిశు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి చెప్పారు. అంగన్వాడి కేంద్రాలలో మహిళలు పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించడంతో పాటు వాటికి స్వంత భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎంతో చొరవ చూపుతోంది. దశాబ్దాల గా వీరు అందిస్తున్న సేవలు గుర్తించి అనేక  కార్యక్రమాలు చేపడుతున్నది కూటమి ప్రభుత్వం. ఆర్ధిక ప్రయోజనాలు కల్పించడం తోబాటు పని ప్రదేశంలో సౌకర్యాలు మెరుగుపరిచి ప్రమాణాలు పెంపొందించడానికి గత ఇరవై నెలల్లో ఎన్నో ముందడుగులు పడ్డాయి. 

త్రాగునీరు,  టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నమన్నారు. ప్రభుత్వం మహిళలు పిల్లలకు తీసుకుంటాం సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీ సెంటర్లు అత్యంత దయనీయ స్థితిలో ఉండేవని సకాలంలో టీచర్లకు జీతాలు చెల్లించే వారు కాదని టీచర్లు నానా ఇబ్బందులు పడేవారని  అంగన్వాడీ సెంటర్లలో టెలివిజన్,ఆర్, ఓ, వాటర్, ఆటవస్తువులు, చార్టులు ఇండక్షన్ స్టవ్, నాణ్యమైన వంటపాత్రలు, ఇలా పలు రకాల మౌలిక సదుపాయాలు నెలకొల్పిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చింది మా ప్రభుత్వం ఆన్నారు. అంగన్వాడీ టీచర్ల 9 డిమాండ్లలో చాలా వరకూ నెరవేర్చామన్నారు. 

క్రమంగా ప్రతీ నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లింపు. గత ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిని దివాళా చేసిందని  వారు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నామని తెలియజేసారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం రెండు సార్లు జీతాలు పెంచిందని అన్నారు. అంగన్వాడీ సెంటర్లలో త్రాగునీరు మరుగుదొడ్లకు రూ.86.68.లక్షలు ఖర్చు చేశామని తెలిపారు.
గతంలో కేవలం అరకొర జీతాలు ఉండగా కూటమి ప్రభుత్వం టీచర్ల జీతాలు పెంచి అంగన్వాడీ టీచర్ల ఆర్ధిక, సంక్షేమాభివృద్ధికి తోడ్పడిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం  అన్నారు.
సుమారు.75 కోట్లతో.5G, మొబైల్స్ కొనుగోలు చేసి 58,204 మంది టీచర్లుకు అందించామని తద్వారా సెంటర్లలో చిన్నారులకు, గర్భిణీలకు బాలింతలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుతున్నాయన్నారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…