అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్వాడీల వేతనాలు పెంచలేమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. వేతనాల పెంపుపై ఎన్నికల తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
"అంగన్వాడీల విధులు అత్యవసరం కాబట్టే సమ్మెపై 'ఎస్మా' ప్రయోగించాం. ప్రభుత్వం చేపట్టే ప్రత్యామ్నాయ పనులకు అడొచ్చే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూసుకుంటే వారికే నష్టం జరుగుతుందని తెలుసుకోవాలి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు పట్టుదలకు పోవద్దు. భవిష్యత్తులో వేతనాలు పెంచుతాం.. సమ్మె విరమించాలి. సమ్మె చేస్తోన్న వారిపై దురుసుగా ప్రవర్తించవద్దని పోలీసులకు సూచించాం. మున్సిపల్ కార్మికులతో చర్చలు జరుగుతున్నాయి. వారిని ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చే యోచన లేదు" అని సజ్జల తెలిపారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి