మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన బాలకృష్ణ...
మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతు తెలిపారు. ప్రస్తుతం హిందూపురంలో పర్యటిస్తున్న ఆయన.. పట్టణంలోని మున్సిపల్ కార్మికుల సమ్మె శిబిరానికి వెళ్లారు. మున్సిపల్ కార్మికులతో కలిసి కిందనే కూర్చుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
15 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని.. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయిందని బాలకృష్ణ అన్నారు. వారి సమస్యలపై పోరాటం చేస్తున్న కార్మికులకు తన అండా, తెలుగుదేశం పార్టీ అండా కచ్చితంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వస్తే కచ్చితంగా కార్మికులకు న్యాయం చేస్తామన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వైసీపీ పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని బాలకృష్ణ విమర్శించారు. ఉరవకొండలో జర్నలిస్టులపై దాడి వైసీపీ పైశాచికత్వానికి నిదర్శనం అని మండిపడ్డారు.రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. వైసీపీ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి