ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మండిపడిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. టిడిపి అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని, తాను చెప్పినట్లు తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. ఓట్ల కోసం నీఛమైన స్ధాయికి దిగజారుతున్నాడని ధూళిపాళ్ల విమర్శించారు.
జగన్ ఇచ్చే చిల్లర పైసలకు కక్కుర్తి పడుతున్న పేటియం బ్యాచ్, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చిల్లరపోస్టులు పెడుతోందన్నారు. కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్ చేసిన పోరాటంపై తెలుగుదేశం పార్టీకి, నేతలకు ఎంతో గౌరవం ఉందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, అణగారిన వర్గాలపై దాడులు చేస్తున్న జగన్...సైకో పాలన సాగిస్తున్నాడని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించి... ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలను అయోమయానికి గురి చేసి...తిరిగి అధికారంలోకి రావాలన్న కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు జగన్ ను నమ్మే పరిస్ధితుల్లో లేరని, తప్పుడు ప్రచారానికి అంబేద్కర్ ను వాడుకుంటున్నందుకు జగన్ సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి